వర్ధన్నపేట : కేసీఆర్ హయాంలో బడుగు బలహీన వర్గాలకు అందించిన సంక్షేమ పథకాలను నిరంతరం కొనసాగించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేసేకుందుకు కుట్రపన్నుతున్నదని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సంక్షేమ పథకాలను అడ్డుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. నాడు కేసీఆర్ ముందు చూపుతో పేదింటి ఆడబిడ్డల కన్నీళ్లను తుడిచేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు పలు సంక్షేమ ఫలితాల నిలిపివేతపై వర్ధన్నపేట తహసీల్దార్కు మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.