ధర్మసాగర్ : వాతావరణ మార్పుల వల్ల చిత్తడి నేలలు అంతరించిపోతున్నాయని విశ్రాంత అటవీశాఖ అధికారి కాజీపేట పురుషోత్తం అన్నారు. ఫిబ్రవరి 2 చిత్తడి నేలలు దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక హనుమకొండ ఆధ్వర్యంలో ధర్మసాగర్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..చిత్తడి నేలలు సహజంగానే నీటిని శుభ్రం చేస్తాయని అన్నారు. పట్టణాల విస్తరణ, ఆక్రమణల ద్వారా, ప్లాస్టిక్, రసాయనాల కాలుష్యం కారణంగా చిత్తడి నేలలు అంతరించి పోతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణాలు, గ్రామాలలో ఉన్న చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని అన్నారు.