సుబేదారి (వరంగల్) జూన్ 29 : తమ ఇండ్లను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ..వరంగల్ నగరంలోని పద్మాక్షి గుడి సమీప చరబండ రాజు కాలనీవాసులు సోమవారం హనుమకొండలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ తమ ఇండ్లను కూల్చి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కూడా సీఐ కరుణాకర్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం కోవడం లేదనీ వాపోయారు. పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి తమ ఇండ్లను కూల్చివేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు సీపీని కోరారు.