కాజీపేట, జూన్ 08: కాజీపేట పట్టణంలోని పలు ప్రాంతాలు సోమవారం మృగశిల కార్తెని పురష్కరించుకుని చేపల విక్రయ దారులతో సందడిగా మారింది. మృగశిర కార్తె రోజున చేపలు తీనాలనే నానుడి అనవాయితీగా వస్తుంది. కార్తె తోలి రోజు చేపలు తింటే ఆరోగ్యం బాగుంటుం దని, వ్యాధులు దూరమవుతాయనే నమ్మకంతో చేపలను కొనేందుకు ప్రజలు బారులు తీరారు. పట్టణంలోని డిజీల్ కాలనీ, బాపూజీనగర్, కూరగాయల మార్కెట్, సోమిడి రోడ్డు, ఫాతిమానగర్ చౌరస్తా తదితర ప్రాంతాలలో చేపల వ్యాపారులు టెంట్లు వేసుకుని అమ్మకాలు జోరుగా సాగించారు.
కార్తెను దృష్టిలో ఉంచుకుని చేపల వ్యాపారులు నిత్యం వ్యాపారం కన్న పెద్ద ఎత్తున చేపలను తెప్పించి అమ్ముతున్నారు. మామూలు రోజుల్లో తెల్ల చేపలు కిలోకు రూ.150 వరకు ఉంటే మృగశిర రోజున కిలో 180, నుంచి 200 రూపాయలు, బొమ్మె చేపలను ఏకంగా ఐదు నుంచి ఆరు వందలకు అమ్మారు. వ్యాపారులు చేపల ధరలను భారీగా పెంచారు. కాజీపేట ట్రాఫిక్ సీఐ వెంకన్న ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు తీసుకున్నారు.