హనుమకొండ చౌరస్తా, జూన్ 9: కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్కాలేజీ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాల నిర్వహణ లక్ష్యంగా బెంగళూరుకు చెందిన లాక్ష్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థతో అవగాహన ఒప్పందం (ఎం.ఓ.యు.) కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఉపాధి సంబంధిత నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, డిజిటల్ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడం నేటి అవసరమన్నారు.
లాక్ష్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాలు, కెరీర్ మార్గదర్శక శిబిరాలు, పరిశ్రమల ఆధారిత అభ్యాస కార్యక్రమాలు, ఇంటర్న్షిప్ అవకాశాలు విద్యార్థుల భవిష్యత్కు ఎంతో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ ఎం.డి. రెహమాన్, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ జితేందర్, తెలంగాణ మేనేజర్ రవికుమార్, సాయిచరణ్, రమేష్, గిరిప్రసాద్ పాల్గొన్నారు.