హనుమకొండ చౌరస్తా, జూలై 6 : భారతదేశం గర్వించదగ్గ మహానేత, అలుపెరగని శ్రామికుడు, నిరంతరం ప్రజా సేవకు అంకితమైన నాయకుడు బాబు జగజీవన్రాం అని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం అన్నారు. కేయూ ఆడిటోరియం ప్రకన నిర్వహించిన బాబుజగజీవన్రాం 40వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని అయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలు అర్పించారు.
అనంతరం ప్రసంగిస్తూ బాబు జగ్జీవన్రాం రామ్ నేటి యువతకు ఆదర్శప్రాయమని, సామజిక న్యాయం, సమానత్వం, ప్రజా సేవపట్ల అయన చూపిన అంకితభావం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకమన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ ఆచార్య బి.వెంకట్రామిరెడ్డి, పాలక మండలి సభ్యులు బి.సురేష్లాల్, బి.రమ, ఎన్.సుదర్శన్, క్యాంపస్ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్, ఎస్సీ,ఎస్టీ సంఘ బాధ్యులు ఈసం నారాయణ, విద్యార్థులు పాల్గొని ఘననివాళి అర్పించారు.