హనుమకొండ చౌరస్తా, జూలై 7: తెలంగాణ రాష్ర్టంలో మూడు నెలల నుంచి ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ జరుగుతున్న సందర్భంలో రాజకీయ పార్టీల కార్యకర్తలు, పౌర సమాజం, యువజన సంఘాలు, విశ్రాంత ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు, సామాజిక చైతన్య సంస్థలు, వేదికలు, వాకర్ సంఘాలు, అత్యంత జాగ్రత్తతో 18 సంవత్సరాల పైబడిన యువతీ యువకుల నుండి అత్యంత వృద్ధులైన వారి ఓట్లను కాపాడవలసిన బాధ్యతను గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ర్ట చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. మంగళవారం హనుమకొండ ప్రెస్క్లబ్లో ‘సర్’ సమస్యలపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఎన్నికల్లో ధనవంతులు ఓటు హక్కును ఉపయోగిస్తారని కేవలం పేద వర్గాలు మాత్రమే ప్రభుత్వాల తలరాతలు నిర్ణయిస్తారని అలాంటి ఓట్లు జాబితా నుండి గల్లంతు కాకూడదన్నారు. సంక్లిష్టమైన ఓటర్ నమోదు ఫారం నింపే అవగాహనలేని ఓటర్లు అత్యధికంగా ఉన్న విషయాన్ని ఎలక్షన్ కమిషన్ అధికారులు, నియోజకవర్గ స్థాయి ఎన్నికల అధికారులు గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు బొమ్మినేని పాపిరెడ్డి, సాయిని నరేందర్, డాక్టర్ రాజ్ మహ్మద్, వీరమల్ల బాబురావు, పుల్లూరు సుధాకర్, సోమ రామమూర్తి, దొమ్మాట ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.