హనుమకొండ చౌరస్తా, జూలై 28 : కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కర్నాటి ప్రతాప్రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. సోమవారం సాయంత్రం ఆఫీస్లో కొంత అసౌకర్యానికి గురి కావటంతో క్యాంపస్లోని హెల్త్ సెంటర్లో అందుబాటులో ఉన్న డాక్టర్ కే.బుచ్చిరెడ్డి ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా రక్తపోటు, ఈసీజీలో కొంత హెచ్చుతగ్గులు ఉండటంతో వెంటనే నగరంలోని రోహిణి హాస్పిటల్కు తరలించారు.
అక్కడ పరీక్షించిన వైద్యులు సూచనలతో అంజియోగ్రం నిర్వహించి స్టంట్ వేసినట్లు, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నందున వైస్ ఛాన్సలర్ను పరామర్శించటానికి హాస్పిటల్కు రావద్దని అందరూ సహకరించాలని కోరారు.