హనుమకొండ చౌరస్తా, జూలై 13 : ఈనెల 14న నిర్వహించాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయం బి.టెక్ (ఆరో సెమిస్టర్), ఫార్మ్-డి మూడో సంవత్సరం, బి.ఫార్మసీ రెండో, నాల్గవ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్ తెలిపారు.
వాయిదాపడిన పరీక్షలను బి.టెక్(ఆరో సెమిస్టర్)-జూలై 27, ఫార్మా-డి మూడో సంవత్సరం-జూలై 25, బి.ఫార్మసీ రెండో సెమిస్టర్-జూలై 20, బి.ఫార్మసీ ఆరో సెమిస్టర్-జూలై 25 తేదీలలో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలు, పరీక్షా సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని, విద్యార్థులు సవరించిన పరీక్షల షెడ్యూల్కు సంబంధించిన పూర్తి వివరాలను విశ్వవిద్యాలయ వెబ్సైట్లో పరిశీలించాలని ఆయన సూచించారు.