హనుమకొండ చౌరస్తా, జూన్ 18 : ఈ నెల 20న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ యోగా టీచర్స్ కో ఆర్డినేషన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు జరుగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని ప్రముఖ యోగా గురువు టీవైటీటీసీ వరంగల్ ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీ పోశాల, శ్రీనివాస్ కోరారు. హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో యోగా గురువు పోశాల శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ఒక భూమి-ఒక ఆరోగ్యం’ అనే థీమ్తో పది సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరాలలోకి అడుగుపెడుతున్న శుభసందర్భంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో పాల్గొనడానికి భారత మాజీ ఉపరాష్టపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస దర్మ, నందమూరి బాలక్రిష్ణ, టీవైసీసీ ప్రెసిడెంట్ రవికిషోర్, సినీ ప్రముఖులు పాల్గొనే కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా యోగా ప్రేమికులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యోగాసాధకులు నాగిళ్ల, వేణుశర్మ, జయశ్రీ, శ్రీవిద్య, రాజేశ్తో పాటు టీవైసీసీ సభ్యులు పాల్గొన్నారు.