జైనూర్, ఆగస్టు 12 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ లక్ష్మీరెడ్డి అన్నారు. బుధవారం జైనూర్లోని జడ్పీఎస్ఎస్ పాఠశాల ఆవరణలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, జిల్లా కలెక్టర్ కే.హరితతో కలిసి మొక్కలు నాటారు. పాఠశాల ఆవరణలో పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. విద్యార్థులు మొక్కల సంరక్షణ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారాం, వీబీజీరామ్ ఏపీవో నగేశ్, వ్యవసాయ మార్కె ట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్, వివిధ గ్రామాల సర్పంచులు, తదితరులున్నారు.
సిర్పూర్(యూ), ఆగస్టు 12: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకున్నప్పుడే గ్రామా ల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని రూరల్ డెవలప్ మెంట్ కమిషనర్ లక్ష్మీరెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం లింగాపూర్ మండలంలోని జాముల్ధర, చో ర్పల్లిలో వాటర్ షెడ్ ద్వారా నిర్మించిన కుంటలను పరిశీలించి చేప పిల్లలను వదిలారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 291 కుటుంబాలకు స్వయం ఉపాధి కోసం కుటుంబానికి రూ.38 వేల చొప్పున వంద శాతం సబ్సిడీపై గతంలో ఆర్థిక సహాయాన్ని అందించగా లబ్ధిదారులు ఎలా స్వయం ఉపాధి పొందుతున్నారనే అంశంపై ఆరా తీశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి, వ్యాపార అంశాలపై సూచనలు చేశారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని, అటవీ అధికారులు చేలల్లోకి వెళ్లనివ్వడం లేదని వారికి గిరిజనులు విన్నవించారు.