నర్సింహులపేట, ఫిబ్రవరి 6 : కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు కోసం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే నిరహార దీక్షను మహబూబాబాద్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో గీత కార్మికులు తరలిరావాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యాక్షుడు డొనికెన రామన్న కోరారు. శుక్రవారం నర్సింహులపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 17 హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిరహారదీక్ష నిర్వస్తారన్నారు.
బడ్జ్లో గీతకార్మికులకు రూ.5000కోట్లు కేటాయించాలన్నారు. పెన్షన్ రూ.4 వేలు పెంచుతామని, ఎక్స్గ్రేషియో రూ.10లక్షలు ఇస్తామని చెప్పిన ఇప్పటి వరకు 850 మంది గీత కార్మికులకు రూ. 14 కోట్లు బకాయి ఉందన్నారు. గీత కార్మికుల హక్కుల సాధనకు నిర్వహించే నిరహార దీక్షకు పెద్ద ఎత్తున తరలిరవాలని కోరారు. ఈ సమావేశంలో గాడిపల్లి రవి, జంపన్న, వెంకన్న, సోమన్న, శ్రీను, ఉపేందర్ ఉన్నారు.