హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సిద్ధాంత కర్త, పోరాట స్ఫూర్తి ప్రధాత ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ప్రతి ఏటా ‘తెలంగాణ అస్తిత్వ దినం’గా నిర్వహించాలని తెలంగాణ అస్తిత్వ వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, కన్వీనర్ పిట్టల రవీందర్, కో ఆర్డినేటర్ శ్రీధర్రావు దేశ్ పాండే ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ అస్తిత్వ దినం సందర్భంగా ఆగస్టు 6న రాష్ట్రంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సభలు, సమావేశాలు, సెమినార్లు, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షల అమలు తీరుపై, స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణంపై లోతైన చర్చలు, సమీక్షలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.