ఖిలావరంగల్, మార్చి 16: శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్, ఎస్బీఐ సహకారంతో సోమవారం 8, 9, 10వ తరగతుల్లో చదువుతున్న సుమారు 100 మంది బాలికలకు దాదాపు రూ.65 వేల విలువైన రీయూజబుల్ సానిటరీ కిట్స్ను అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ అధ్యక్షుడు గణేష్ కుమార్ మాట్లాడుతూ బాలికలు రుతుక్రమం గురించి భయపడకుండా, బాధపడకుండా ఉండాలన్నారు.
అది జీవన చక్రంలో సహజమైన భాగమని అర్థం చేసుకుని పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఆరోగ్యకర మైన సమాజ నిర్మాణంలో బాలికల ఆరోగ్యం కీలకమని ఆయన పేర్కొన్నారు.
ప్రధానోపాధ్యాయులు నరేంద్ర స్వామి మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణ సాధనలో రోటరీ క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడారు. బాలికల ఆరోగ్య అవగాహన కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు సదానందం, హరినాథ్, కుమారస్వామి, అనిల్ కుమార్, ఉపాధ్యాయులు దేవరాజు, అంజయ్య, భవాని, లక్ష్మీనారాయణతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.