హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 9: వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ(నిట్)లోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ, ఇండియా సహకారంతో వాస్టెక్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్-ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్ అండ్ ఎక్స్పోపై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లక్ష్యం ఎలక్ట్రిక్ వాహనాల పవర్ యూనిట్ల సురక్షిత పనితీరు, సామర్థ్యం, దీర్ఘకాలిక వినియోగాన్ని నిర్ధారించడంలో బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్స్లోని ఆధునిక సాంకేతిక నిర్మాణం, భద్రతా ప్రోటోకాళ్ల ప్రాధాన్యతను వివరించడమనపి నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి అన్నారు.
థర్మల్ మేనేజ్ మెంట్, ఓవర్ వోల్టేజ్, ఓవర్ కరెంట్, ఓవర్ చార్జ్ రక్షణ, స్టేట్ ఆఫ్ చార్జ్, డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్, పూర్తి చార్జ్-డిశ్చార్జ్ చక్రాల నిర్వహణ, వాహన భద్రత వంటి అంశాలపై మేధస్సుతో కూడిన, సమర్థవంతమైన బ్యాటరీ మానిటరింగ్ వ్యవస్థల రూపకల్పనకు అవసరమైన నైపుణ్యాలను అభ్యాసకులకు అందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు.