దుగ్గొండి, మార్చి, 10 : డ్రగ్స్ రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరు పాటుపడాలని నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. సోమవారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల గిర్ని బావి, నాచినపల్లి, దుగ్గొండి, వెంకటాపురం ఉన్నత పాఠశాల విద్యార్థులకు మత్తు పదార్థాలు డ్రగ్స్ రహిత సమాజం కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెడు సావాసాల వైపు వెళ్లకుండా యువత తమ బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు.
గ్రామాల్లోని పరిసర ప్రాంతాల్లో మత్తు పదార్థాల వినియోగిస్తున్న వారి సమాచారాన్ని పోలీసులకు తెలుపాలన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా వినియోగించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రావుల రణధీర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.