వరంగల్ : బహిరంగ ప్రదేశాలలో పోగతాగిన19మందికి జరిమానా విధించినట్లు హనుమకొండ డీఎంహెచ్వో డాక్టర్ లలితాదేవీ ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం హనుమకొండలోని ఎల్బీ కళాశాల, నిట్, న్యూ బస్స్టేషన్, కెయూ క్రాస్ రోడ్ ప్రాంతాలలో ఆకస్మీక తనిఖీలు నిర్వహించినట్లు ఆమె పెర్కొన్నారు. పోగాకు ఉత్పత్తుల యాక్ట్లో భాగంగా ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలు నగరంలో పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సిగరెట్ బహిరంగ ప్రాంతాలలో తాగడం వల్ల వారితో పాటు పోగ పీల్చిన వారు అనారోగ్యం పాలవుతారని తెలిపారు. నింబధనలకు విరుద్దంగా బహిరంగ ప్రదేశాలలో పోగతాగితే కఠినంగా వ్యవహిరిస్తామని ఆమె హెచ్చరించారు. తనిఖీల్లో సబ్ ఇన్స్స్పెక్టర్ విల్సన్, హెల్త్ సూపర్వైజర్ రాంచందర్, శానిటరి ఇన్స్స్పెక్టర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.