నర్సంపేట, నవంబర్ 3: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మితే ప్రజలు ఆగమైపోతరని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని రెండో వార్డులో 50 కుటుంబాలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా పెద్ది వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పే గ్యారెంటీ పథకాలను నమ్మొద్దని కోరారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదని విమర్శించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేకసార్లు కాంగ్రెస్ అధికారంలో ఉందని, కానీ తెలంగాణకు ఏమీ చేయలేదని విమర్శించారు. నాడు సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితిలోనూ ప్రజలు ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. తాను నర్సంపేట డివిజన్ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నానని, కారు గుర్తుకు ఓటువేసి తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. నర్సంపేట పట్టణ అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించినట్లు వివరించారు. మళ్లీ గెలిస్తే నర్సంపేట నియోజకవర్గంలో రెట్టింపు స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో ముస్కు శ్రీను, రాంరెడ్డి, ప్రభాకర్, తిరుపతిరెడ్డి, చంద్రమౌళి, మధు, నాగరాజు, రాజు, వీరయ్య, హరీశ్, సోమేశ్, సుధాకర్, మనోజ్, ప్రేమ్, సురేశ్, లక్ష్మయ్య, మహేందర్, శ్రీకాంత్, కొమురమ్మ, రమణి ఉన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జుర్రు రాజు పాల్గొన్నారు.
నెక్కొండ: సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై మండలంలో కాంగ్రెస్ నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతుండడంతో ఆ పార్టీ గ్రామాల్లో ఖాళీ అవుతున్నదని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. టేకులకుంట, బొగ్గుతండా నుంచి 40 గిరిజన కుటుంబాలు సుదర్శన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. బొగ్గుతండా నుంచి బోడ శ్రీను, స్వరూప, అనిత, నరసింభ భాగ్య, అంబాలి, హమ్య, వసురాం, కైక, లక్ష్మ, విజయ, వినోద్, సక్రు, జాము, సేవ్య, లక్ష్మి, చిన్ని, మాలోత్ వాగ్య, బాలి, మాలోత్ జ్యోతి, భూక్యా శంకర్, రంగి, అనిత, చందూలాల్, ఈర్య, భాగ్యమ్మ, శారద, బోడ దూజ్య, బోడ భాస్కర్, ఆంగోత్ మోహన్ పార్టీలో చేరారు. అలాగే, సీతారాంపురం నుంచి కాంగ్రెస్కు చెందిన నెక్కొండ సొసైటీ డైరెక్టర్ సింగారపు కమలమ్మ, కో ఆప్షన్ మెంబర్ కత్తుల పద్మ, కత్తుల కొమురయ్య, సింగారపు నేవిల్, సింగారపు జితేందర్, సింగారపు తరుణ్, సింగారపు సాయికృష్ణ, సింగారపు సుమన్, కొయ్యల దినేశ్, అలువాల చిన్న యాకయ్య, అలువాల పెద్ద యాకయ్య, జక్కుల రామకృష్ణ, సింగారపు ఎలియా బీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గాదె భద్రయ్య, భూక్యా హేమచందర్, తేజావత్ నరేశ్, తేజావత్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట(దుగ్గొండి): తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. దుగ్గొండి మండలంలోని కేశవపురంలో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ప్రధాన అనుచరులు, బంధువులు, రేకంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేశ్, డాక్టర్ శ్రావణ్ పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. శివాజీనగర్కు చెందిన యుగేంధర్, నాగరాజుతోపాటు పలువురు, నారాయణతండాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. గోపాలపురంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరు కుటుంబాలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ మొగిలి, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్: బీఆర్ఎస్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మండలంలోని ఇటుకాలపల్లి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 కుటుంబాలు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. మండల సదానందం, బర్ల సాయిలు, మండల సదయ్య, మండల శ్రీను, డ్యాగల స్వామి, మండల రమేశ్, తప్ప రమేశ్, గడ్డ విష్ణు, సోనబోయిన రాజు, మండ రాజు, సోనబోయిన బాబు, ఎంబాడి చేరాలు, మేడబోయిన రాజు, తెప్ప రాజేందర్, సోనబోయిన శివకుమార్, సోనబోయిన రవి, సోనబోయిన శివాజీ, తెప్ప దేవేందర్, భూమ జంపయ్య, సొప్పరి వెంకటేశ్ బీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ మోతె జయపాల్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొడారి రవన్న, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భూక్యా వీరన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే, గురిజాల నుంచి డ్యాగల శివకృష్ణ, చింతకాయల రాజు, కామగోని వంశీ, అన్న నవీన్, అల్లి రితిన్, పసునూరి పవన్, సార గణేశ్, అల్లి శ్రీకాంత్, పాకల అభిలాష్తోపాటు మరికొంత మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. మాదన్నపేట, నాగుర్లపల్లికి చెందిన 15 మంది యువకులు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వినయ్, అజయ్, రోహిత్, రాఘవేంద్ర, బన్నీ, యశ్వంత్, సాయిరాం, నాగరాజు, సందీప్, మిన్ను, సిద్దూ, మునేందర్, అఖిల్, సునీల్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
నల్లబెల్లి: ప్రజల ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే భాగ్యం తనకు కలిగిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మేడెపల్లి, నారక్కపేట గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 75 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. పెద్ది వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మేడెపల్లి మాజీ ఎంపీటీసీ పాడియా భద్రు, తేజావత్ సక్రూ, నునావత్ ఈర్య, అజ్మీరా వీరన్న, చందు, యాకూబ్, వెంకటేశ్వర్లు, వీరన్న, యాకయ్య, ఓదెలు, సుధాకర్, లాల్సింగ్తోపాటు మరో 50 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి.