హసన్పర్తి, సెప్టెంబర్ 14 : మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హసన్పర్తి పెద్ద చెరువులో గురువారం ప్రత్యేక పూజలు చేసి, రూ.1.85లక్షల విలువైన 3.22 లక్షల చేప పిల్లలను మత్స్యశాఖ ఏడీ విజయభారతితో కలిసి చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతో మత్స్యకారుల కష్టాలు తీరాయన్నారు.
ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసి, మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మత్స్య కార్మికుల సొసైటీలు ఏర్పాటు చేసి, వారికి హక్కులను కల్పించిక గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సంఘం మండల అధ్యక్షుడు పిట్టల కుమారస్వామి, ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు శీలం పృథ్వీరాజ్, కార్పొరేటర్ శివకుమార్, ఉపాధ్యక్షుడు పిట్టల జితేందర్, కార్యదర్శి పెద్దమ్మ శ్రీనివాస్, డైరెక్టర్లు శీలం రాజేందర్, పెద్దమ్మ సుధాకర్, సంగనవేని వీరేశం, వెంగల రాజ్కుమార్, శీలం భిక్షపతి, గోనెల ఉపేందర్ పాల్గొన్నారు.