నమస్తే నెట్వర్క్, ఆగస్టు 5 : ‘వరాల తల్లీ దీవించు.. కోర్కెలు నెరవేర్చి చల్లగా చూడు’ అంటూ మహిళలు మనసారా వేడుకున్నారు. శ్రావణ శుక్రవారాన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వత్రాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో కుంకుమార్చలు, అభిషేకాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్య తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. కొందరు తమ ఇళ్లలోనే లక్ష్మీదేవతను ప్రత్యేకంగా అలంకరించి నేవైద్యం సమర్పించారు. అనంతరం తోటి మత్తయిదువులను పిలిచి వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సకల శుభాలు, ఐశ్యర్యం కలగాలని రోజంతా ఉపవాసం ఉండి.. భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవతను ఆరాధించారు.