హనుమకొండ సబర్బన్ (ఎల్కతుర్తి) డిసెంబర్ 18 : మండలంలోని పెంచికల్పేట క్రాస్రోడ్డు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదేగ్రామానికి చెందిన రైతు మామిడి రాజిరెడ్డి (65) మృత్యువాత పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. రాజిరెడ్డి హుజూరాబాద్ వైపు నుంచి తన ద్విచక్రవాహనంపై వస్తున్నాడు.
ఈ క్రమంలో హనుమకొండ వైపు నుంచి వేగంగా వచ్చిన కారు రాజిరెడ్డి వాహనాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో రాజిరెడ్డి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.