వరంగల్, జూన్ 12(నమస్తేతెలంగాణ): కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ రంగంలోకి దిగింది. రూ.840 కోట్లతో ఇక్కడ వస్త్ర పరిశ్రమలను నెలకొల్పేందుకు సౌత్కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీ ఎవర్ టాప్ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతోముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో టీఎస్ఐఐసీ సదరు కంపెనీకి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో 298 ఎకరాల స్థ లాన్ని కేటాయించింది. దీంతో ఈ స్థలంలో వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులను మొ దలు పెట్టేందుకు యంగ్వన్ కంపెనీ సిద్ధమైంది. ఈ పనులకు 17వ తేదీన రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేయనున్నారు.
యంగ్వన్తో ఎన్ని ఉద్యోగాలంటే..
సౌత్కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఎవర్ టాప్ టెక్స్టైల్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో వస్త్ర పరిశ్రమలను స్థాపించేందుకు టీఎస్ఐఐసీతో అవగాహన కుదుర్చుకుంది. ఇక్కడ తమకు కేటాయించిన 298 ఎక రాల్లో రూ.840 కోట్లతో వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. పనులు ప్రారంభమైన రోజు నుంచి ఏడాదిలో ఉత్పత్తి మొదలు కానుందని ఎవర్ టాప్ టెక్స్టైల్స్ ప్రైవేటు లిమిటెడ్ ప్రకటించింది. తమ పరిశ్రమల ద్వారా 11,700 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రభుత్వానికి తెలిపింది. మరో 11,700 మందికి పరోక్షంగా ఉపాధి కలగనుందని అధికారులు విశ్వసిస్తున్నా రు.
స్పోర్ట్స్ వేర్ ఈ కంపెనీ స్పెషల్. ఎవర్ టాప్ టెక్స్టైల్స్ పరిశ్రమల్లో ఉత్పత్తి అయ్యే స్పోర్ట్స్ టెక్స్టైల్స్ను క్రీడాకారులు వినియోగిస్తారు. పలచని కోటు వాడే చలి దేశాల్లో ఎక్కువగా ఈ కంపెనీ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. మంత్రి కేటీఆర్ ఈ నెల 17న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఎవర్ టాప్ టెక్స్టైల్స్ ప్రైవేటు లిమి టెడ్ పరిశ్రమల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో చేనేత జౌళి శాఖ సెక్రటరీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, కలెక్టర్ ప్రావీణ్య గత గురువారం ‘మెగా’ పార్కును సందర్శించి మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఎవర్ టాప్ టెక్స్టైల్స్ ప్రైవేటు లిమిటెడ్, కిటెక్స్, గణేశా కంపెనీల ప్రతినిధులతో ఉత్పత్తి, ఉపాధిపై మాట్లాడారు. పార్కులో జరుగుతున్న మౌలిక వసతుల నిర్మాణ పనులను టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ సంతోష్కుమార్ తమ సంస్థ అధికారులతో కలిసి పర్య వేక్షిస్తున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.