పర్వతగిరి, డిసెంబర్6: వర్ధన్నపేట నియోజ కవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. మండలంలోని మంగ్త్యా తండా, బూరుగుమళ్ల, చింతనెక్కొండ, బట్టు తండా గ్రామాల్లో రూ. 7.86 కోట్లతో చేపట్టిన శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, ప్రా థమిక ఆరోగ్య కేంద్రం, గ్రంథాలయం, ఆర్అండ్ బీ రోడ్డు, మహిళా సంఘం కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్డు తదితర అభివృద్ధి పనులను ఆయన మంగ ళవారం ప్రారంబించారు. అనంతరం బూరుగు మళ్ల, చింతనెక్కొండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని చెప్పారు. ప్రజాసంక్షేమమే ధ్యేయం గా ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తు న్నారని పేర్కొన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్ వంటి అనేక ప్రజా సంక్షేమ పథకా లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికీ అందిస్తున్నద న్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగ్లాల్, మనోజ్కుమార్గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు ఈర్యానాయక్, ఇందిరాజితేందర్రె డ్డి, సుష్మా మహేశ్, వైస్ ఎంపీపీ రాజేశ్వర్రావు, మండల పార్టీ అధ్యక్షుడు రంగు కుమారస్వామి నాయకులు మేడిశెట్టి రాములు, సర్వర్, ఎంపీటీ సీలు మౌనిక, సుభాషిణి పాల్గొన్నారు.
అంబేద్కర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో పాలన
వర్ధన్నపేట: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే అ రూరి రమేశ్ అన్నారు. అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్ర హానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాం గంలో నిమ్నజాతుల ఉన్నతి కోసం అంబేద్కర్ రిజర్వేషన్లతో పాటు పలు రకాల అవకాశాలు కల్పించారన్నారు. దీనిమూలంగానే నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయ, ఉద్యోగ, వైద్య, విద్యారంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. అలాగే రాష్ట్ర ఏర్పాటు కూడా ఆయన రాజ్యంగంలో చేర్చి న ఆర్టికల్ మూలంగానే వచ్చిందని ఆయన అ న్నారు. నేటి యువత అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని ఎంచుకున్న రంగంలో రాణించాలని కో రారు. అలాగే మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతిని ఎంపీపీ అన్నమనేని అప్పా రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేద్కర్ సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబే ద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ అరుణ, వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, మున్సిపల్ కౌ న్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, యువ కులు పాల్గొన్నారు.