ములుగు, మే 26 (నమస్తే తెలంగాణ): చేపలు పట్టేందుకు చెరువులోని నీటిని ఖాళీ చేస్తున్నారు. వేలాది క్యూసెక్కుల నీటిని వృథాగా వదిలేస్తున్నారు. ములుగు జిల్లా అతిపెద్ద జలాశయమైన లోకంచెరువు నుంచి కొన్ని రోజులుగా నీటిని విడుదల చేస్తున్నారు. చెరువులో నీటిమట్టం ఎక్కువగా ఉన్నందున చేపలు పట్టేందుకు వీలు కాకపోవడంతో అధికారులు మత్స్యకారులకు వంతపాడి నీరంతా తూము గేట్లు ఎత్తి కాల్వ ద్వారా బయటకు పంపుతున్నారు. ఆయకట్టు పంటలకు అవసరమైనప్పుడు మాత్రమే నీటిని విడుదల చేయాలనే నిబంధనలు ఉండగా అధికారులు అదేమీ పట్టించుకోకుండా, మత్స్యకారుల కాసులకు కక్కుర్తి పడి నీటిని వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. నీరు వృథాగా పోతుండగా ఆయకట్టు రైతులు ఆందోళన ఎలుకల బాధకు ఇల్లు తగులబెట్టుకున్న చందంగా చేపలు పట్టేందుకు పంటలకు అవసరమైన నీటిని వృథాగా బయటకు వదలడం ఏమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. చెరువులో నుంచి నీరు బయట పోతుండగా సంఖ్యలో చేపలు సైతం చనిపోయి కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే చెరువు నీరంతా వృథాగా పోతోందని పలువురు రైతులు
కాకతీయుల కాలం నాటి లోకంచెరువు కింద 3వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువులోని నీరు రెండు పంటలకు సరిపోతాయి. ఐదేళ్లుగా ఎండా కాలంలో సగం కంటే ఎక్కువ నీరు నిల్వ ఉంటోంది. మూడేళ్లుగా వర్షాకాలం ప్రారంభంలోనే మత్తడి పోస్తూ ఉంటుంది. ఐదేళ్ల కింద చేప పిల్లలు పోసిన కాంట్రాక్టర్ రెండేళ్లు చెరువులో నీటిమట్టం ఎక్కువగా ఉండటంతో చేపలు పట్టలేదు. దీంతో వానాకాలం ప్రారంభంలో చెరువు మత్తడి పడినప్పుడు చేపలు దిగువకు వెళ్లిపోయాయి. చేపలు పోసిన కాంట్రాక్టర్ ప్రస్తుతం చేపలు పట్టుకునేందుకు నీటిని తూముల ద్వారా కాల్వల్లోకి వదులుతుండడంతో దిగువనున్న తోపుకుంట పూర్తిగా నిండింది. మిగిలిన నీళ్లు వెళ్తోంది. ఈ క్రమంలో నీరంతా వృథాగా పోతోంది.
చెరువు తూముల వద్ద షెట్టర్ల లీకేజీ కారణంగా నీళ్లన్నీ కాల్వలోకి వెళ్తున్నాయి. ఎన్నికల విధుల్లో ఉన్నందున లీకేజీ విషయం నా దృష్టికి రాలేదు. ఎన్నిక తర్వాత షెటర్లకు మరమ్మతులు చేయించి లీకేజీలను అరికడుతాం.