‘సకల వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కల వృత్తులను కాపాడేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నది. ఇక్కడి పథకాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నది. తెలంగాణలో సబ్బండ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎ కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారు.’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం రాయపర్తిలో సంక్షేమ సంబురాలు నిర్వహించారు. పలువురికి కల్యాణలక్ష్మి, కుల వృత్తిదారులకు చెక్కులు అందజేశారు. గొల్లకుర్మలకు రెండో విడుత గొర్రెలు పంపిణీ చేశారు.
రాయపర్తి, జూన్ 9 : రాష్ట్రంలోని సకల వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మండలంలోని కిష్టాపురం క్రాస్ రోడ్డులోని వీఆర్ గార్డెన్స్లో సంక్షేమ సంబురాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ అలుపెరుగని పోరాటం చేశాడని, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అహర్నిశలు ఉద్యమాలు చేసిన కేసీఆర్ అభినవ గాంధీ అని కొనియాడారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, కుల వృత్తులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందినట్లు చెప్పారు. అనంతరం పలువురికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మైనార్టీ కార్పొరేషన్, కుల వృత్తి దారులకు చెక్కులను అందజేశారు. యాదవులకు రెండో విడుత గొర్రెల పంపిణీ పథకం, ఇటీవల వడగండ్ల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ కోట శ్రీవత్స, డీఆర్డీవో మిట్టపల్లి సంపత్రావు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, వీరగోని శృతి, సోమశేఖర్, ఏవో గుమ్మడి వీరభధ్రం, సర్పంచ్లు, ఎంపీటీసీలు గారె నర్సయ్య, లేతాకుల సుమతి, కోదాటి దయాకర్రావు, భూక్యా క్రాంతి, చెడుపాక కుమారస్వామి, నలమాస సారయ్య, కుక్కల భాస్కర్, గాడిపల్లి వెంకటయ్య, అయిత రాంచందర్, దీప్లానాయక్, నాయకులు పూస మధు, ఎండీ నయీం, గబ్బెట బాబు పాల్గొన్నారు.