హనుమకొండ చౌరస్తా, జనవరి 2: మహాలక్ష్మీ పథకం ప్రారంభానికి ముందు బస్సుల్లో 45 నుంచి 60 మంది ప్రయాణించేవారని ఆ సంఖ్య గణనీయంగా పెరిగి డీజిల్ వాడకంలో తేడా, టైర్లపై భారం, కమాన్పట్టీలు ..విరగడం, బస్సుల మెయింటనెన్స్ విపరీతంగా పెరిగిందని అద్దె బస్సుల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆర్టీసీ ఆర్ఎం జే శ్రీలతను కలిసి వారు తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.
ప్రస్తుతం ఇస్తున్న అద్దె బస్ రేటు మరో రూ.2 పెంచాలని, బస్సుల్లో ప్రయాణిస్తున్న అందరికీ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని, ఉచిత ప్రయాణంతో ట్రాఫిక్ పెరిగి టైర్లు పగిలిపోతున్నాయని వివరించారు. ఆర్టీసీ వారి టైర్లను హైర్బస్సులకూ బల్క్రేటుకు ఇవ్వాలని కోరారు. ఓవర్లోడ్తో కేఎంపీఎల్ బాగా తగ్గిందని, 4.5 కేఎంపీఎల్గా ఇవ్వాలని, 5వ తేదీలోగా సమస్యలు పరిష్కరించాలని ఆర్ఎంను కోరారు. రాష్ట్ర నాయకులు ప్రభాకర్, సదానందం, వెంకటేశ్వర్లు, కుమార్, వెంకటరెడ్డి ఉన్నారు.