చెన్నారావుపేట, నవంబర్ 26: కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, గిరిజనులకు స్వయం పరిపాలన అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని రాష్ట్ర స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మండలంలోని పుల్లాయబోడుతండాలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ను మరోసారి ఆదరించాలని ఆమె కోరారు. నర్సంపేట నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన పెద్దిని భారీ మెజార్టీతో గెలిపించాని విజ్ఞప్తి చేశారు. డివిజన్లోని గిరిజనుల కోసం ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. ప్రతి తండాలో సీసీ, బీటీ లింక్ రోడ్లు నిర్మించారని చెప్పారు. అలాగే, ప్రతి తండాకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిచారని గుర్తు చేశారు. పెద్ది గిరిజన పక్షపాతి అని, మరోసారి గెలిపిస్తే గిరిజనబంధు పథకం ద్వారా గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తారన్నారు.
మరోసారి అవకాశం ఇవ్వాలి : పెద్ది నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రైతుల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. మండలంలోని పాపయ్యపేట, అమృతండా, బోజెర్వు, పుల్లాయబోడుతండా, టీక్యాతండా, ధర్మతండా, తిమ్మరాయిన్పహాడ్, జోజిపేట, అక్కల్చెడ, చెన్నారావుపేట, పాత ముగ్దుంపురంలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దికి ప్రజలు బతుకమ్మలు, కోలాటాలు, డప్పుచప్పుళ్ల మధ్య ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీంతో గ్రామాలన్నీ గులాబీమయమయ్యాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, పరుగులు పెడుతున్న అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆరే గ్యారెంటీ అని, ఎలాంటి గ్యారెంటీలు లేని దొంతిని, కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మండలంలో అనేక అభివృద్ధి పనులు చేశానన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు దొంతి మాధవరెడ్డి ఓట్ల కోసం తప్ప గ్రామాల్లో చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. తాను నియోజకవర్గంలోని రైతుల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానని, అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోతే ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇప్పించానని గుర్తుచేశారు. 50 శాతం సబ్సిడీతో రైతులకు యాంత్రీకరణ పనిముట్లు అందించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జి రాయుడి రవీందర్రెడ్డి, జడ్పీటీసీ పత్తినాయక్, పార్టీ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, నాయకులు బాల్నె వెంకన్న, తూటి శ్రీనివాస్, వీరారెడ్డి, రఫీ, జక్క అశోక్, రాంరెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి, మురహరి రవి, కొండవీటి పావని-ప్రదీప్కుమార్, సమ్మునాయక్, అండ్ర విజయ, కుండె మల్లయ్య, అనుముల కుమారస్వామి, కిషన్, రమేశ్, ధరావత్ శ్రీను, మాదాసి కుమారస్వామి, బోడ కల్పన, మజ్జిగ రాంబాబు పాల్గొన్నారు.
నర్సంపేట: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నిక ప్రచారంలో భాగంగా పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి షాపునను వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ నేతలు చెప్పే మాటలు నమ్మొద్దని, కర్ణాటక రాష్ట్రంలో హామీలను మరిచిపోయారని గుర్తుచేశారు. కార్యక్రమంలో నాయకులు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లివెంకటనారాయణగౌడ్, మున్సిపల్ చైర్మన్ గుంటి రజినీకిషన్, రాయిడి రవీందర్రెడ్డి,నల్ల మనోహర్రెడ్డి ,కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్: నియోజకవర్గ ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే నర్సంపేటను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ద్వారకపేట 6, 7 వార్డుల నుంచి బీజేపీకి చెందిన 150 కుటుంబాలు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. బీజేపీ నాయకులు చింతం విజయరాణి, కొలిపాక భవాని, ఓరుగంటి అక్షర, ఆవుల అనిత, ఆకుల లావణ్య, మిట్టపల్లి పద్మ, ఆడప రాధమ్మ, ఓరుగంటి అనూష, గుండం కల్పన, పాపని అమల, ఓరుగంటి విజయతోపాటు మరికొన్ని కుటుంబాలను ఆయన బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, నాయకులు కల్యాణ్రామ్, పల్నాటి సాంబయ్య, వేల్పుల సురేష్, బోళ్ల స్వామి, మాదాసి శ్రీనివాస్, రాయరాకుల శ్రీను, మంద ప్రకాశ్ పాల్గొన్నారు. అలాగే, మండలంలోని మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎర్రల కరుణాకర్, ఎర్రల నవీన్, బొక్క నరేశ్, అరూరి అలీం, అజ్మీరా చిన్న కొమ్మాలుతోపాటు మరికొంత మందికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, గ్రామ అధ్యక్షుడు చేరాల గోవర్ధన్, పిన్నింటి దేవేందర్రెడ్డి, మోతె పద్మనాభరెడ్డి, మచ్చిక రాజు, ఐలయ్య పాల్గొన్నారు.