నమస్తేతెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 21 : వరంగల్, హనుమకొండ జిల్లాలోని మినీ మేడారం జాతరలు భక్తజనంతో కిటకిటలాడాయి. అగ్రంపహాడ్ సమ్మక్క-సారలమ్మ జాతర జనసందోహంగా మారింది. బుధవారం భక్తులు భారీగా తరలివచ్చారు. అగ్రంపహాడ్ సారలమ్మ పూజారి గోనెల వెంకన్న ఇంట్లో పూజారులు గోనెల సారంగపాణి, గోనెల రవీందర్, గుల్లపల్లి సాంబశివరావు, సహాయ పూజారులు ఉడుతనబోయిన గోవర్ధన్, రేగుల సునీత, సిరిపురి శారద ప్రత్యేక పూజాలు చేశారు. సారలమ్మ తల్లిని డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య గోనెల వెంకన్న గద్దెపై ప్రతిష్ఠించారు. సారలమ్మ గద్దెపై కొలువు తీరడంతో మహా జాతర తొలి ఘట్టం ప్రారంభమైంది. అనంతరం భక్తులు అమ్మవారికి మొక్కలు సమర్పించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, ఏసీపీ కిశోర్కుమార్, వరంగల్ సహాయ కమిషనర్ సునీత, ఈవో శేషగిరి, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి, సీఐలు సంతోష్, రవిరాజు, జాతర కమిటీ చైర్మన్ శీలం రమేశ్ పాల్గొన్నారు. కాగా, సారలమ్మ తల్లికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మొక్కలు చెల్లించారు. అలాగే, ములుకనూరు, కొత్తకొండ గ్రామాల్లో బుధవారం సాయంత్రం సారలమ్మ తల్లి గద్దెకు చేరుకుంది. శివసత్తుల నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య సారలమ్మ తల్లిని వనం నుంచి మేడారం కోయ పూజారులు గద్దెకు తీసుకువచ్చారు. జాతర ఏర్పాట్లను ఎంపీపీ జక్కుల అనిత, జడ్పీటీసీ వంగ రవి పర్యవేక్షించారు.
ఆలయ చైర్మన్లు మాడుగుల వీరేశం, పూదరి రవీందర్ భక్తులకు సదుపాయాలు కల్పించారు. అలాగే, ఎల్కతుర్తి మండలంలోని దామెరలో పూజారి మద్దె భూమయ్య ఆధ్వర్యంలో పగిడిద్ద రాజును, మద్దె కొండయ్య సారలమ్మను ఊరేగింపుగా గద్దెకు తీసుకొచ్చారు. జాతర కమిటీ చైర్మన్ ఠాకూర్ రాంసింగ్ ఉన్నారు. అలాగే, శాయంపేట మండలంలోని జోగంపల్లి జాతరలో పెద్దకోడెపాక గ్రామంలో అమ్మ ధర్మయ్య ఇంటి నుంచి మేడారం నుంచి వచ్చిన పూజారులు సారలమ్మ తల్లిని గద్దెల వద్దకు చేర్చారు. జాతర చైర్మన్ అబ్బు ప్రకాశ్రెడ్డి పాల్గొన్నారు. వరంగల్ ఉర్సులోని కోడూరి వారి ఇంటి నుంచి బుధవారం అమ్మవార్ల ప్రతిమలను ఊరేగింపుగా అమ్మవారిపేట జాతర స్థలానికి తీసుకెళ్లారు. చైర్మన్ కోడూరి భిక్షపతి ఆధ్వర్యంలో వైభవంగా వనదేవతల ఊరేగింపు నిర్వహించారు. అలాగే, రాత్రి వేళ సారలమ్మను దామెరగుట్ట నుంచి పోలీసుల బందోబస్తు మధ్య వడ్డె బౌరిశెట్టి శ్యామ్ తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. నల్లబెల్లి మండలం మద్ది మేడారంలో సారలమ్మ, జంపన్న కొలువయ్యారు. తహసీల్దార్ రాజేశ్, ఏసీపీ కిరణ్కుమార్ పర్యవేక్షణలో సాయంత్రం 5 గంటలకు మండలంలోని గాంధీనగర్ నుంచి పూజారి ధర్మపురి సువర్ణ 15 కిలో మీటర్ల కాలినడకన శివసత్తుల పూనకాల మధ్య సారలమ్మతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజును తీసుకొచ్చి మల్లెపూలగుట్ట మద్దిమేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠించారు. సారలమ్మ ఆగమనంతో వనదేవతల జాతరకు అంకురార్పణ జరిగింది. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గాదె సుదర్శన్, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై నైనాల నగేశ్, మాజీ సర్పంచ్ గోనె శ్రీదేవి, ఎండోమెంట్ అధికారి భిక్షమాచారి, ఏడాకుల సంపత్రెడ్డి, ఆర్ఐ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. మేడెపల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
శాయంపేట, ఫిబ్రవరి 21 : మండలంలోని జోగంపల్లి జాతర తన హయాంలోనే అభివృద్ధి చెందిందని, ఇప్పుడు పైసా పెట్టని దుస్థితి ఉందని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని జోగంపల్లి జాతరలో గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను స్పీకర్గా ఉన్న సమయంలోనే జోగంపల్లి జాతరను అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. అమ్మవార్ల గద్దెల చుట్టూ సీసీతో పాటు ప్రాంగణం ప్రహరీ నిర్మించి, భక్తులకు సౌకర్యాలు సమకూర్చినట్లు తెలిపారు. సమ్మక్క-సారలమ్మ దయతో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిందన్నారు. పీఏసీఎస్ డైరెక్టర్ బగ్గి రమేశ్, మాజీ మండలాధ్యక్షుడు గుర్రం రవీందర్, సిరికొండ యువసేన జిల్లా నాయకుడు బేరుగు రాకేశ్ పాల్గొన్నారు.