సుబేదారి, మార్చి 29 : గ్రూప్-1 ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ ముఠా కోట్ల తెలుగు రాష్ర్ర్టాల్లో రూపాయాల వసూళ్లకు పాల్పడింది. ప్రధాన నిందితుడు కొత్త వీరేశం అరెస్టుతో ముఠా మోసాలు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం సుబేదారి పోలీస్స్టేషన్లో హనుమకొండ ఏసీపీ జితేందర్రెడ్డి వివరాలు వెల్లడించారు. వరంగల్ పిన్నావారి వీధికి చెందిన కొత్త వీరేశం మొదట్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు పైరవీలు చేసి డబ్బులు తీసుకునేవాడు. కానీ ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశ కలిగింది. వీరేశం కుమారుడు గోపీనాథ్కు హైదరాబాద్ ఎల్బీనగర్ రాక్టౌన్ కాల నీకి చెందిన గూడూరు పవన్కుమార్తో పరిచయం ఉంది.
ఈ క్రమంలో వీరేశం, పవన్కుమార్ ప్రతిమ హాస్పిటల్ డాక్టర్లు బొమ్మన రఘునందన్రావు, బోయినపల్లి రవీందర్రావు, ఊటుకూరి శ్రీనివాస్రావును పరిచయం చేసుకున్నారు. వైద్యుల పేరుతో వీరేశం, పవన్కుమార్ ఏపీ, తెలంగాణలో ప్రముఖులు, ఉన్నతాధికారులను కలిసేవారు. ఈ క్రమంలో గ్రూప్-1 ఉద్యోగాలు ఇప్పిస్తామని వీరేశం, పవన్కుమార్, అడ్వకేట్ ఉటుకుని శ్రీనివాస్రావు, గోపీనాథ్, ఏపీకి చెందిన రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్న బుచ్చిబాబు అలియాస్ బుచ్చయ్య, పవన్కుమార్ భార్య పద్మజ, ఊటుకూరి శ్రీనివాస్రావు, బోయినపల్లి రవీందర్రావు, వీరేశం భార్య కొత్త అరుంధతి తెలుగు రాష్ర్టాల్లో చాలామంది నుంచి రూ.4.5కోట్ల వసూళ్లకు పాల్పడ్డారు.
ముఠాలో ప్రధాన నిందితుడు వీరేశంను అరెస్ట్ చేసి విచారణ చేయగా ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి వరంగల్లో చాలాకాలం పనిచేసి మృతిచెందిన రిటైర్డు అడిషనల్ ఎస్పీ భాస్కర్రావు భార్య శ్రీదేవి కూడా ముఠా బాధితుల్లో ఉన్నారు. శ్రీదేవి తన కుమారుడికి ఏపీలో గ్రూప్-1 పోస్ట్ కోసం రూ.2.5కోట్లు ఇచ్చినట్లు పోలీసు విచారణలో తేలింది. పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతున్నదని ఏసీపీ తెలిపారు. కాగా, పోలీసులు వీరేశం నుంచి రూ.25లక్షల విలువైన బంగారు ఆభరణాలు, బ్యాంకు పాస్బుక్లు, ప్రామిసరీ నోట్స్, 3 పాస్పోర్ట్లు, రూ.71,700 నగదు స్వాధీనం చేసుకున్నారు.