హసన్పర్తి, ఆగస్టు 14 : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా మండలంలోని బైరాన్పల్లి నుంచి పెగడపల్లి వరకు వేసిన బీటీ రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి ఎమ్మెల్యే సోమవా రం క్షేత్రస్ధాయితో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డును వెంటనే మరమ్మతు చేపట్టి తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. భవిష్యత్లో మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మా ట్లాడుతూ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందేలా వెంటనే పంట నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కాగా, హసన్పర్తికి కేటాయించిన 108 అంబులెన్స్ను కార్పొరేటర్ శివకుమార్తో కలిసి ఎమ్మెల్యే అరూరి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ సునీత, జడ్పీటీసీ సునీత, బీఆర్ఎస్ ఒకటో డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్, పీఏసీఎస్ చైర్మన్లు జక్కు రమేశ్గౌడ్, గోపాల్రెడ్డి, మెరుగు రాజేశ్గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్, మార్కె ట్ డైరెక్టర్ గనిపాక విజయ్, కుడా మాజీ డైరెక్టర్ రమేశ్ యాదవ్, సర్పంచ్లు సాంబారెడ్డి, ఐలయ్య, మాజీ జడ్పీటీసీ సుభాష్గౌడ్ పాల్గొన్నారు.
హసన్పర్తికి చెందిన శీలం రాణికి సీఎంఆర్ఆఫ్ నుంచి మంజూరైన రూ.లక్ష విలువగల చెక్కును ఎమ్మెల్యే రమేశ్ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి అందజేశారు. అనంతరం రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, ప్రత్యేక పూజలు చేశారు. ఇదే గ్రామానికి చెందిన జన్ను కొమురయ్య, శనిగరం ఎల్లమ్మ, భీమారానికి చెందిన ఎర్రగట్టుగుట్ట ఆలయ డైరెక్టర్ బుర్ర రాజు తండ్రి అనారోగ్యం తో మృతి చెందగా వారి కుటుంబాలను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ జక్కుల రజితా-వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షుడు అటికం రవీందర్, పాపిశెట్టి శ్రీధర్, ఆత్మ చైర్మన్ చంద్రమోహన్, మార్కెట్ డైరెక్టర్ వీసం సురేందర్రెడ్డి, పిట్టల కుమారస్వామి ఉన్నారు.
నయీంనగర్ : పర్వతగిరి మండలంలోని వడ్లకొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పడిదాల పరమేశ్వర్రావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు సోమవారం హనుమకొండలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ తన నివాసంలో పరమేశ్వర్రావుకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటుందన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు.