ప్రచారంలో కారు దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు నాయకులతో కలిసి ఊరూరా తిరుగుతూ ప్రతి గడపకూ ఎన్నికల మ్యానిఫెస్టోను చేరుస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో అన్ని వర్గాలతో మమేకమవుతూ ప్రజలకు రాష్ట్ర సర్కారు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివరిస్తున్నారు. కారు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా సకల జనులు బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నారు. కారు గుర్తుకే ఓటేస్తామని నినదిస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రచారం ఊరూరా జోరందుకుంది. నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డిని గెలిపించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు మ్యానిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
నర్సంపేట, నవంబర్ నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీ కిషన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ ఆదివారం నర్సంపేట పట్టణంలో ఇంటింటా ప్రచారం చేశారు. వారు మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, కాంగ్రెస్కు గతంలో చాలాసార్లు ఇచ్చినప్పటికీ ప్రజల సంక్షేమం, అభ్యున్నతి గురించి పట్టించులేదన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేటలో ప్రజలకు అందుబాటులో ఉన్నారని తెలిపారు. మరోసారి పెద్దిని గెలిస్తే రెట్టింపు స్థాయిలో అభివృద్ధి జరుగుతుందన్నారు. కారు గుర్తుపై ఓటు ప్రజలను కోరారు. కౌన్సిలర్లు జుర్రు రాజు, రాయిడి కీర్తీ దుశ్యంత్రెడ్డి, నాగిశెట్టి పద్మా ప్రసాద్, వేల్పుగొండ పద్మరాజు,దార్ల రమాదేవి, రాయరాకుల సారంగం, నాగెల్లి శివరాం పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్: బీఆర్ఎస్ శ్రేణులు ఆదివాం మండలంలోని లక్నెపల్లి, రామవరం, ముగ్దుంపురం, ద్వారకాపేట, మహేశ్వరం గ్రామాల్లో ప్రచారం చేశారు. సర్పంచ్లు గొడిశాల రాంబాబుగౌడ్, కొడారి రవన్న, పెండ్యాల జ్యోతి, మినుముల రాజు ఉన్నారు. మగ్దుంపురంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చాపర్తి భిక్షపతి, పెండ్యాల ప్రభాకర్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు పెండ్యాల సదానందం, ఉప సర్పంచ్ ఇస్లావత్ రాజన్న, రాజు, రమేశ్, గొడిశాల అశోక్, జినుకల విజేందర్, జినుకల శంకర్, ఐలయ్య ఉన్నారు. కమ్మపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న మాట్లాడారు. ఎమ్మెల్యే పెద్ది గెలుపు కోసం కృషి చేయాలన్నారు. జడ్పీటీసీ కోమాండ్ల జయ, సర్పంచ్ వల్గుబెల్లి రంగారెడ్డి, ఎంపీటీసీ వల్గుబెల్లి విజయ-ప్రతాప్రెడ్డి ఉన్నారు.
ఖానాపురం: మండలంలోని పెద్దమ్మగడ్డలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు ఆదివారం బొడ్రాయి వద్ద పూజలు చేసి, ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాకాలకు శాశ్వత జలవనరులు కల్పిస్తామని గతంలో ఎంతోమంది హామీలకే పరిమితం కాగా, ఎమ్మెల్యే పెద్ది పాకాలకు గోదావరి జలాలను తీసుకువచ్చారని తెలిపారు. మరోసారి ఎమ్మెల్యేగా పెద్దిని గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. వల్లెపు శ్రీనివాస్, రవి, వడ్డే వెంకటేశ్, శైలజ, దమయంతి, మేడిద కుమార్ పాల్గొన్నారు.
చెన్నారావుపేట: మండల ఎన్నికల ఇన్చార్జి, ఆర్బీఎస్ రాష్ట్ర డైరెక్టర్ రాయుడి రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటా ప్రచారం కొనసాగించారు. అమినాబాద్, కోనాపురం, పాపయ్యపేట, బోడమాణిక్యం తండాలో ఇన్చార్జిలు ప్రచారం చేశారు. ధర్మతండా, అమృతండాలో డీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, డాక్టర్ లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్ వాసు, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, జడ్పీటీసీ పత్తినాయక్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, ముఖ్య నాయకులు బాల్నె వెంకన్న, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, జిల్లా డైరెక్టర్ తూటి శ్రీనివాస్, క్లస్టర్ బాధ్యులు వీరారెడ్డి, మాజీ ఎంపీపీ జక్క అశోక్, యూత్ కన్వీనర్ కృష్ణచైతన్యరెడ్డి, రాంరెడ్డి, సర్పంచ్ కుండె మల్లయ్య, సొసైటీ చైర్మన్ మురహరి రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాదాసి కుమారస్వామి, పార్టీ గ్రామ అధ్యక్షులు సాంబయ్య, కడారి సాయిలు పాల్గొన్నారు.