సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు బీఆర్ఎస్ సర్కారు నడుం బిగించింది. 2015లో మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టి ప్రతి చెరువును పక్కా ప్రణాళికతో పునరుద్ధరించింది. నాలుగేళ్ల పాటు దశల వారీగా ఈ పథకం కింద నిధులు కేటాయించి చెరువుల్లో పూడిక తీయించింది. కట్ట, తూములు, మత్తళ్లను బలోపేతం చేసింది. లైనింగ్, మట్టితో డిస్ట్రిబూటరీ, పంట కాల్వలను పటిష్టం చేసింది. చెరువులోకి వరద నీరు చేరే ఫీడర్ చానళ్లను పునరుద్ధరించింది. సకల జనులకు ప్రయోజనం కలిగేలా చెరువులను తీర్చిదిద్దింది. దీంతో వరద నీరు ఆటంకం లేకుండా చెరువుల్లోకి చేరుతున్నది. పూడిక తీతతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. భూగర్భ జలాలు మీదికి వచ్చి బావుల్లోనూ పుష్కలంగా నీటి లభ్యత ఉన్నది. ఎండా కాలంలో ఎక్కడా చెరువులు ఎండిపోకుండా నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ప్రతి చెరువు కింద ఉన్న ఆయకట్టు పూర్తిగా సాగులోకి వచ్చి అన్నదాతల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. చెరువుల్లో చేపల పెంపకంతో మత్స్యకారులకూ ఉపాధి దొరుకుతున్నది. మిషన్ కాకతీయతో తెలంగాణ ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడం వల్లే తమకు కొండంత భరోసా దక్కిందని ఇటు రైతులు, అటు మత్స్యకారుల్లో హర్హం వ్యక్తమవుతున్నది.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకొని స్వయం పాలనతో తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని పదవ వసంతాన అడుగుపెడుతున్న శుభ సందర్భాన రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఒకప్పుడు వ్యవసాయ భూములు నెర్రలు వాసి పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. తెలంగాణ రాక ముందు దండగలా ఉన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తాత, ముత్తాతల నాటి గొలుసు కట్టు చెరువులకు పూర్వవైభవం సంతరిం చుకుంది. కేసీఆర్ సీఎం అయిన తరువాత సాగు, తాగు నీటి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.
ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెరువులన్నింటికి పూడిక తీత పనులతో పాటు కట్టలకు పెద్ద ఎత్తున మరమ్మతులు చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు గొలుసుకట్టు చెరువుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో చెరువులకు పూర్వ వైభవం నెలకొంది. మిషన్ కాకతీయ పథకం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చెరువుల న్నింటిని మరమ్మతులు చేశారు. ప్రతి చెరువులో పూడికతీత పనులతో పాటు కట్టలను బాగు చేశారు. అంతే కాకుండా తూములు, మత్తళ్లకు మరమ్మతులు చేశారు. తద్వారా చెరువుల్లో నీటిమట్టం విపరీతంగా పెరగడంతో పాటు చెరు వుల కింద సాగు విస్తీర్ణం కూడా పెరిగింది.
చెరువులను మర మ్మతులు చేయక ముందు చెరువుల ద్వారా వంద ఎకరాలు సాగయితే మిషన్ కాకతీయ ద్వారా రెండింతల సాగు విస్తీర్ణం పెరిగింది. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గొలుసుకట్టు చెరువులను దశలవారీగా మరమ్మతులు చేపట్టారు. మిషన్ కాకతీయ ఫేస్-1, ఫేస్-2, 3,4 నాలుగు విడుతల్లో అన్ని చెరువు లను అభివృద్ధి చేశారు. దీంతో సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. అంతేకాకుండా చెరువులను అభివృద్ధి చేయడం ద్వారా ఉచితంగా చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేయ డంతో వాటిని చేరువుల్లో పోస్తు న్నారు.
ఒక హెక్టార్కు మూ డువేల నుంచి నాలుగు వేల చేప పిల్లలను పోస్తున్నారు. పెరిగిన చేపలను మార్కెట్లో విక్రయించి మత్స్య కుటుంబా లు ఆర్థికంగా ఎంతో బలపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెరువుల పండుగ నిర్వ హిస్తున్నారు. అక్కడే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన అనంత రం చెరువు కట్టలపై భోజనాలు చేయ నున్నారు. 20214 నుంచి 2023 వరకు ఒక్క మహబూబాబాద్ జిల్లాలో రూ.22కోట్ల విలువగల 26 కోట్ల చేప పిల్లలను చెరువుల్లోకి వదిలారు. వీటి ద్వారా మత్స్యకారులకు 82,895 టన్నుల ఉత్పత్తి వచ్చింది. తద్వారా రూ.2,566 కోట్ల ఆదాయం సమకూరింది.
ఉమ్మడి రాష్ట్రంలో చిన్న వానలకే చెరువు కట్టలు తెగిపో యేది. భారీ వర్షాలు కురిస్తే చెరువు నిండి కట్టతెగి వర్షం నీరు అంతా పొలాల్లోకి వెళ్లేది. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువు కట్టలను ఎంతో కట్టుదిట్టం చేశారు. ఈనేప థ్యం లో ఎంత పెద్ద వర్షం కురిసినా చెరువు కట్ట తెగడం అనే మాట ఇప్పటి వరకు చూడలేదు. అతిపెద్ద భారీ వర్షా లు కురిసినా చెరువులు నిండి మత్తళ్లు పోస్తున్నాయి. తప్ప కట్టలు తెగిన దాఖలాలు లేవు. మండుటెండల్లో సైతం వా గులు, చెరువుల్లో సైతం నీళ్లు కళకళలాడుతున్నాయి. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు ఎంతో అభివృద్ధి చెందడంతో పాటు గొర్లు, మేకలు, పశువులు, గేదెలు, పక్షులకు తా గేందుకు నీరు పుష్కలంగా ఉంటోంది. ఉమ్మడి జిల్లావ్యా ప్తంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులను ఎంతో అభి వృద్ధి చేశారు. తద్వారా చెరువు కట్టలకు నాణ్యతతో నిర్మించారు.
మిషన్ కాకతీయ ద్వారా నాలుగు విడుతలుగా చెరువు లను అభివృద్ధి చేశారు. చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడంతో నీటిమట్టం విపరీతంగా పెరిగింది. తద్వారా గొలుసు కట్టు చెరువుల ద్వారా సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. దీంతో ఆయకట్టు రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన ప్రతి చెరువు కింద సాగు విస్తీర్ణం డబుల్ అయ్యింది. దీంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రతి చెరువును ఎంతో అభివృద్ధి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు ల్లోకి కాళేశ్వరం నీళ్లను మిడ్మానేరు ద్వారా ఎస్సారెస్పీ స్టేజీ-1, స్టేజీ-2 ద్వారా జిల్లాలోని చెరువులను నింపుతు న్నారు. అంతేకాకుండా వాగుల్లోకి కాళేశ్వరం నీటిని విడుద ల చేయడం ద్వారా వాగుపై నిర్మించిన చెక్డ్యాంలు నిండి మత్తళ్లు పోస్తున్నాయి. మండుటెండల్లో వాగులు, చెరువులు మత్తళ్లు దూకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.