ఐనవోలు, సెప్టెంబర్ 28 : ‘ఆదరించి.. అధిక మెజార్టీతో గెలిపించండి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తాను’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని వెంకటాపురంలో బీఆర్ఎస్ గ్రామ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. సందర్భంగా గ్రామానికి వచ్చిన కడియం శ్రీహరికి ఎంపీపీ మార్నేని మధుమతి, ‘ఆదరించి.. అధిక మెజార్టీతో గెలిపించండి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తాను’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని వెంకటాపురంలో బీఆర్ఎస్ గ్రామ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. సందర్భంగా గ్రామానికి వచ్చిన కడియం శ్రీహరికి ఎంపీపీ మార్నేని మధుమతి, జజడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ గ్రామ ఎన్నికల కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కడియం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటాపురం గ్రామం తనకు ఎంతో ఇష్టమైన గ్రామమని, ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చిన్నట్లుగా ఉంటుందన్నారు. ‘ఆదరించి.. అధిక మెజార్టీతో గెలిపించండి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తాను’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని వెంకటాపురంలో బీఆర్ఎస్ గ్రామ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. సందర్భంగా గ్రామానికి వచ్చిన కడియం శ్రీహరికి ఎంపీపీ మార్నేని మధుమతి, జగతంలో తాను ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు తన వల్ల గ్రామానికి కానీ, గ్రామ ప్రజలకు ఎలాంటి తలవంపులు తేలేదన్నారు.
గ్రామ ప్రజల కోరిక మేరకు తన శక్తి మేరకు బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు మంజూరు చేసినట్లుగా గుర్తు చేశారు. ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఉందని, అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే అభివృద్ధి కొనసాగుతుందన్నారు. ఎంతో మందికి సంక్షేమ ఫలాలను అందిస్తున్న ప్రభుత్వాన్ని మళ్లీ ఆదరించి, గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ప్రలోభ పెట్టి, అమలు చేయలేని పథకాలను ప్రజల్లోకి తీసుకురావాలని చూస్తున్నాయన్నారు. వారి మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్లు గోనే రేణుక, గండి మల్లికాంబ, ఎంపీటీసీ పిండి మాధవి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ సంపత్కుమార్, ఉప సర్పంచ్ జ్యోతి, సొసైటీ చైర్మన్ రాంచంద్రయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు లడె రామారావు, నాయకులు రఘుపాల్రెడ్డి, విక్టర్, బాబు, శ్రీనివాస్, చంద్రశేఖర్, మహేందర్, దేవేందర్, సురేశ్, వెంకట్రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.