పHouthis attacks | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమ ఆసియాలోని కీలకమైన నౌకా రవాణా మార్గాలపై ఆధిపత్యం కోసం అమెరికా, ఇరాన్ల మధ్య పోటీ కొనసాగుతున్న తరుణంలో ఎర్ర సముద్ర తీరంలోని వ్యూహాత్మక నగరమైన హోడెయిడాపై సౌదీ అరేబియా వైమానిక దాడులకు పాల్పడింది. దీంతో యెమెన్లోని హుతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై డ్రోన్లు, క్షిపణులతో భారీ దాడులకు పాల్పడ్డారు. యెమెన్పై సౌదీ అరేబియా వాయు దాడులకు ప్రతీకారంగా యాన్బు, జిజాన్లలోని అరమ్కో (Aramco) చమురు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు హుతీ సైనిక ప్రతినిధి యహ్యా సారీ ప్రకటించారు. యెమెన్పై దిగ్బంధనం ఎత్తేసే దిగ్బంధంన ఎత్తేసే వరకు ఎర్ర సముద్రంలో నౌకలను అడ్డుకుంటామని హుతీలు స్పష్టం చేశారు.
కాగా, ఎర్ర సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తత ప్రపంచ నౌకా రవాణాను మరింతగా అడ్డుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే సౌదీకి సంబంధించిన నౌకల రాకపోకల కోసం బాబ్ ఎల్-మండేబ్ జలసంధిని మూసివేస్తామని తిరుగుబాటుదారులు ప్రకటించడంతో నౌకల రవాణాపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మాట్లాడుతూ..సైనిక ఘర్షణలు లేకుండా యెమెన్ వివాదాన్ని పరిష్కరించడానికి చర్చలు జరపాలని పిలుపునిచ్చారు.