సీఎం కేసీఆర్, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఐదోసారి భారీ మెజార్టీతో గెలుస్తానని వరంగల్ పశ్చిమ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ధీమాగా చెప్పారు. అలాగే రాష్ట్రంలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడారు. తన కోసం అలుపెరగకుండా కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని.. అలాగే గెలుపు కోసం కృషిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
హనుమకొండ, డిసెంబర్ 1 : ముఖ్యమంత్రి కేసీఆర్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఐదోసారి భారీ మెజార్టీతో గెలువబోతున్నానని వరంగల్ పశ్చిమ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 2,86,688 మంది ఓటర్లు ఉండగా 1,62,236 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 59.71 శాతం ఓట్లు నమోదు కాగా ఈసారి కొంతమేరకు తగ్గి 56.59 శాతం ఓట్లు నమోదు అయ్యాయన్నారు. ఇందులో ఎకువ శాతం మహిళలు, యువతీ, యువకులు, పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారని తెలిపారు. తన కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు కంటికిరెప్పలా కాపాడుకుంటానని అన్నారు. అందరి సహకారంతో క్షేత్రస్థాయిలో జరుగుతున్న సమాచారం అందించి, తన గెలుపు కోసం కృషిచేసిన చైర్మన్లు, జిల్లా, రాష్ట్ర నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, గులాబీ శ్రేణులు, పార్టీకి అనుబంధంగా ఉండే సంఘాలు, మీ టీంకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒకరికీ ఈ సందర్భంగా దాస్యం వినయ్భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు.
సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ ఫలాలే తన గెలుపునకు కారణం అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తానని తెలిపారు. రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 66 నుంచి 69 సీట్లు గెలువడం ఖాయం అని పేర్కొన్నారు. గతంలో కంటే ఎకువ మెజార్టీతో గెలువబోతున్నానని అన్నారు. తన గెలుపుతో మరింత బాధ్యత పెరిగి బాధ్యతాయుతంగా మరిన్నిఅభివృద్ధి, సంక్షేమ పథకాలు, మరిన్ని పనులు చేస్తానని అన్నారు. గతంలో చేపట్టిన కార్యక్రమాలను సైతం రాబోవు రోజుల్లో కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. అలాగే నగర అభివృద్ధికి, ప్రజలకు అవసరమయ్యే సౌకర్యాల కల్పనకు కృషిచేస్తానని అన్నారు. సమావేశంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్గౌడ్, కార్పొరేటర్లు బోయినపల్లి రంజిత్రావు, సోదా కిరణ్, బీఆర్ఎస్ నాయులు నలబోల సతీశ్, ఏనుగు రాంప్రసాద్, జానకీరాములు, పులి రజినీకాంత్, వీరేందర్, సుగుణాకర్రెడ్డి, వీరగంటి రవీందర్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.