పర్వతగిరి, జూన్ 21: సమైక్య పాలనలో ఆదరణ కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు స్వరాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకుంటున్నాయని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా మండలంలోని ప్రసిద్ధ అన్నారం షరీఫ్ హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావలి దర్గాలో మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి వేర్వేరుగా దర్శించుకుని బాబాకు పాతియా సమర్పించారు. చాదర్ సమర్పించి, పూలమాలలను అలంకరించారు. ముజావర్లు పాషా నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందన్నారు.
సమైక్య పాలకులు దేవాలయాలు, మసీదులు, చర్చిలను పట్టించుకోలేదన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తింపజేశారని పేర్కొన్నారు. మసీదులకు పూర్వ వైభవం తీసుకువచ్చారని చెప్పారు. సర్వమతాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తూ సర్వమత సామరస్యాన్ని చాటుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆధ్యాత్మికత వైభవం వెల్లివిరుస్తోందని తెలిపారు. ధూప దీప నైవేద్య పథకంతో అర్చకులకు రూ.6వేల నుంచి రూ.10వేల గౌరవ వేతనాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో 30 ఆలయాల్లో ధూప దీప నైవేద్య పథకం అమలవుతుందని ఎమ్మెల్యే అరూరి వివరించారు. పీఏసీఎస్ చైర్మన్ మనోజ్కుమార్గౌడ్, ఎంపీపీ కమల, జడ్పీటీసీ బానోత్ సింగ్లాల్, వైస్ ఎంపీపీ రాజేశ్వర్రావు, ఎంపీడీఓ చక్రాల సంతోష్కుమార్, తహసీల్దార్ కోమి, సర్పంచ్ యశోద, షబ్బీర్అలీ, చిన్నపాక శ్రీనివాస్ పాల్గొన్నారు.
కల్లెడ గ్రామంలో భైరవ సమేత ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి భూమిపూజ బుధవారం ఘనంగా నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కొబ్బరికాయలు కొట్టారు. వారు మాట్లాడుతూ కల్లెడ-బూరుగుమళ్ల గ్రామాల మధ్య ఉన్న స్వయంభూ భైరవ సమేత ఆంజనేయ దేవాలయ నిర్మాణం చేపట్టడం జడ్పీటీసీ సింగ్లాల్, ఎంపీపీ కమల పంతులు, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్కుమార్గౌడ్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, మార్కెట్ డైరెక్టర్లు శాంతి రతన్రావు, ఏకాంతంగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు రంగు కుమార్గౌడ్, స్థానిక సర్పంచు సంపెల్లి శోభ, మండల యూత్ అధ్యక్షుడు గూడ నరేందర్ వర్మ, చిన్నపాక శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్డీఎఫ్ ప్రతినిధి ఎర్రబెల్లి రామ్మోహన్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తిభావం అలవర్చుకోవాలన్నారు. ఆలయం నిర్మాణానికి గ్రామానికి చెందిన మనోజ్రావు రూ.10లక్షలు విరాళం అందిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు.