కాకతీయుల వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్కు చీఫ్విప్ దాస్యం ఆహ్వానం
ఛత్తీస్గఢ్లోని బస్తర్కు వెళ్లి పత్రిక అందజేత
కాకతీయ ఉత్సవాలకు మొదలైన ఏర్పాట్లు
నాటి ఘన చరిత్ర ప్రపంచానికి చాటేలా ప్రణాళికలు
జూలై 7నుంచి వారం పాటు నిర్వహించే కాకతీయ ఉత్సవాలకు రావాలని కాకతీయుల వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆహ్వానించారు. గురువారం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్కు వెళ్లి పత్రికను అందించారు. వేడుకల కోసం జిల్లాలో ఏర్పాట్లు మొదలు కాగా, కాకతీయుల చరిత్రను ప్రపంచానికి చాటేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేసింది.
వరంగల్, జూన్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాకతీయ ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్ల ను ప్రారంభించింది. జూలై 7 నుంచి వారం రోజులపాటు నిర్వహించనున్న వేడుకలకు అంతా సిద్ధం చేస్తున్నది. కాకతీయుల వారసులను ఈ ఉత్సవాల్లో భాగస్వాములను చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు ప్ర భుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ గురువారం ఛ త్తీస్గఢ్లోని బస్తర్కు వెళ్లి కాకతీయు ల వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ను ఆహ్వానించా రు. ఉత్సవాలకు హా జరవుతానని ఈ సందర్భంగా కమల్ చంద్ర భంజ్దేవ్ చెప్పారు. పూర్వీకుల పుట్టినిల్లు తనకూ పుట్టినిల్లేనని, కాకతీయులకు 700 ఏం డ్ల తర్వాత వరంగల్ను సందర్శించే అవకాశం రావ డం సంతోషకరమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కాకతీయ సప్తాహం పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం శుభ పరిణామమని చెప్పారు. ప్రభుత్వ చొరవను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణతో చారిత్రక వారసత్వాన్ని ప్రస్తుత తరానికి తెలియజేయవచ్చన్నారు. వరంగల్ నగరాన్ని చూడాలనే తమ చిరకాల కోరిక త్వరలో తీరనుందని కమల్చంద్ర భంజ్దేవ్ పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, టార్చ్ సంస్థ కార్యదర్శి అరవింద్ ఆర్య ప్రభుత్వ చీఫ్విప్ వినయ్భాస్కర్ వెంట ఉన్నారు.
చరిత్ర తెలిసేలా..
భారతదేశ చరిత్రలో కాకతీయ సామ్రాజ్యం, కాకతీయ పాలనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. తెలు గు మాట్లాడే అన్ని ప్రాంతాలను పరిపాలించిన రాజులుగా వీరు చరిత్రలో నిలిచారు. ఓరుగల్లు(వరంగల్) కేంద్రం గా మొదటి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించి 300 ఏండ్లు పరిపాలించారు. ఢిల్లీ సుల్తానుల వరుస దాడులతో కాకతీయుల సామ్రాజ్యం 1323వ సంవత్సరంలో ముగిసింది. ప్రజల అవసరాలే ప్రధానంగా పరిపాలన సాగించారని కాకతీయులకు పేరున్నది. 1323లో ప్రతాపరుద్రుడి మరణం తర్వాత ఆయన సోదరుడు అన్నమదేవుడు దంతెవాడ కేంద్రంగా 13వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మలి కాకతీయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అన్నమదేవుడితో మొదలైన కాకతీయ వారసుల పరంపర కొనసాగుతున్నది. ఆదివాసీల ప్రాంతంలో కాకతీయుల వారసులు ఇప్పటికీ ప్రాధాన్యతతో కొనసాగుతున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మన చరిత్ర, సాంస్కృతిక వారసత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. కాకతీయుల స్ఫూర్తితో వ్యవసాయరంగానికి ఎక్కువ నిధులు కేటాయించి సాగునీటి వసతి కల్పించింది. కాకతీయుల ఘన వారసత్వాన్ని ఇప్పటి తరానికి తెలియజెప్పేలా ఇప్పుడు ‘కాకతీయ సప్తాహం’ పేరుతో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.