ఎర్రుపాలెం, జూలై 16 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గురువారం పర్యటించి పలువురు నాయకులను పరామర్శించారు. ఇటీవల గుండె శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకుంటున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు షేక్ హుస్సేన్ను ఆయన నివాసంలో కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని ప్రజా సేవలో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. అనంతరం గ్రామంలోని ఐదో వార్డు సభ్యుడు కుర్రా వెంకట్రామయ్యను, సీపీఎం నాయకుడు షేక్ మియాలను పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, నాయకులతో స్థానిక పరిస్థితులు, ప్రజా సమస్యలు, గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఆత్మీయంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరావు, ఎర్రుపాలెం మండల మాజీ జడ్పీటీసీ కవిత, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మండల కమిటీ నాయకులు బుర్ర నరసింహారావు, మల్లికార్జున్ రెడ్డి, లోకేష్, తిరుపతిరావు. తోట శ్రీనివాసరావు, రామకృష్ణ, అశోక్, అఖిల్, మోదిన్తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.