గిర్మాజీపేట, డిసెంబర్ 6: ‘రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2.25 లక్షల ఉద్యోగాలిచ్చింది. ప్రైవేట్ సెక్టార్లో 17 లక్షలు జాబ్లు కల్పిం చింది. కేంద్రం ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగా లు పోయేలా ప్రైవేటీకరణ చేస్తుంది’ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం స్థానిక కార్పొరేటర్ గందె కల్పన అధ్యక్షతన స్టేషన్రోడ్డులోని మహేశ్వరి గార్డెన్లో నన్నపునేని నర్సింహమూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 110 రోజులపాటు శిక్షణ పూర్తి చేసుకున్న యువతీయువకులకు ఉచిత మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మా ట్లాడుతూ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తన తండ్రి పేరిట స్థాపించిన ఎన్ఎన్ చారిటబుల్ట్రస్ట్ ద్వారా నిరుపేద యు వతకు పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణా కేంద్రాన్ని ఏర్పా టు చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు.
కేంద్రం ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా రిజర్వేషన్లు ఎత్తేసే కుట్రలో భా గంగా ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెట్టేలా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఇచ్చినన్ని ఉద్యోగాలు మరెక్కడా ఇవ్వలేదన్నా రు. విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఎమ్మెల్యే నన్నపునేని మాట్లాడుతూ తాను పేదరికం నుంచి వచ్చానని.. విద్యార్థులకు బంగారు భవిష్యత్ కలిగించాలనే తన తండ్రి పేరిట ఏర్పాటుచేసిన ఎన్ఎన్ చారిటబుల్ట్రస్ట్ ద్వారా ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటుచేశానని అన్నారు. దీనికి చైర్పర్సన్గా తన సతీమణి వాణి బాధ్యతలు నిర్వర్తిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వల్లే తాను ఈ స్థానంలో ఉన్నానని.. ప్రజ ల ఆశీర్వాదాలే తన బలం అన్నారు. పితృ సమానులైన మంత్రి దయాకర్రావుది సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానమని, ఆయన ఆశీర్వాదంతో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచుతానని పేర్కొన్నారు.
విద్యార్థులు స్టడీ మెటీరియల్ను సద్వినియోగం చేసుకొని పోటీపరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. మీ అందరి సహకా రంతో ఉచిత గ్రూప్-1 కోచింగ్సెంటర్ ఏర్పాటు చేయడం తన ఆశయమన్నారు. ఉచితంగా కోచింగ్ తీసుకున్న 1800 మంది విద్యార్థుల్లో 200 మంది దాకా పోటీపరీక్షల్లో క్వాలిఫై అయ్యారని గుర్తుచేశారు. మత విద్వేషాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే ఢిల్లీ పార్టీల మాటలు నమ్మి యువత మోసపోవద్దని కోరారు. తాను అనుభవించిన పేదరికం ప్రజలు అనుభవించొద్దనే అహర్నిశలు కష్టపడుతున్నానని అన్నారు. ఈ కోచింగ్ ద్వారా ఉద్యోగం సాధిస్తే అంతకుమించిన సంతోషం మరొకటి తనకు ఉండదన్నా రు. అనంతరం ఎమ్మెల్యే నరేందర్ దంపతులు విద్యార్థులకు మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా ఉచిత మెటీరియల్ ను అందజేశారు. అలాగే విద్యార్థులకు కోచింగ్ ఇచ్చిన అధ్యాపక బృందాన్ని శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో డిప్యూటీమేయర్ రిజ్వానాషమీమ్మసూద్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, ముఖ్యనాయకులు గందె నవీ న్,ముష్కమల్ల సుధాకర్, దుబ్బ శ్రీనివాస్, వివిధ డివిజన్ల అధ్యక్షులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నన్నపునేనికి మంత్రి భరోసా
‘ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి నన్న పునేని నరేందర్ చిన్న కుటుంబం నుంచి వచ్చి మొదట కార్పొరేటర్గా గెలిచాడు. ఆ తర్వాత రెండోసారి కార్పొ రేటర్గా గెలిచి మేయర్గా, తదుపరి ఎమ్మెల్యేగా గెలిచి సక్సెస్ అయ్యాడు. రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే గా సక్సెస్ అవుతాడు. నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. అన్ని విధాలా నా సహాయసహకారాలు ఉంటాయి. నరేందర్కు పెద్దదిక్కుగా ఉంటాను’ అని మంత్రి ఎర్రబెల్లి భరోసా నిచ్చారు. ‘పితృ సమానులైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తనతో ఏం ఫికర్ చెందకు.. అన్ని విధాలా నీకు తోడుంటానని ఇచ్చిన ధైర్యంతో తాను ముందుకు సాగుతున్నా’ అని ఎమ్మె ల్యే నరేందర్ పేర్కొన్నాడు.