తాడ్వాయి, ఫిబ్రవరి 6 : సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన స్వాగత్(23) జంపన్న వాగులో గల్లంతయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన స్వాగత్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం మేడారం వచ్చాడు. దర్శనం అనంతరం జంపన్నవాగు ప్రాంతంలో విడిది చేశారు.
బంధువుల పిల్లలతో కలిసి స్వాగత్ కొత్తూరు లోలెవల్ కాజ్వే సమీప పాలమడుగుకు వద్ద జంపన్నవాగులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. లోతు తెలియక మునిగిపోయాడు. తోటి పిల్లలు బంధువులకు పస్రా సీఐ శంకర్కు సమాచారం ఇచ్చారు. రెస్క్యూ టీమ్ గాలిస్తున్నా ఆచూకీ దొరకలేదు.