ములుగు, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ) : మావోయిస్టుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఎస్పీ శబరీష్ ప్రజలకు సూచించారు. మావోయిస్టు దంపతులు గురువారం ఎస్పీ సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఓఎస్డీ అశోక్కుమార్తో కలిసి వివరాలు వెల్లడించారు. భద్రాద్రి జిల్లా చర్ల మండలం బూర్గుపాడుకు చెందిన నూప భీమా అలియాస్ సంజు మావోయిస్టు పార్టీలో ఏ సెక్షన్ కమాండ్గా పనిచేస్తుండగా అతడి భార్య ముచ్చకి దుల్దో అలియాస్ సోని ఏసీఎంగా ఉన్నారు.
వీరిద్దరు బీజాపూర్ జిల్లా బెచ్చిరాకు మడుగు ఎదురుకాల్పుల సంఘటనతో పాటు 2022 ఫిబ్రవరిలో ఇద్దరు పోలీసులు, జాగురుగొండ ఏరియాలో ముగ్గురు పోలీసులు, 2021లో టెర్రామ్ దాడిలో 26మంది పోలీస్ సిబ్బంది మరణించిన సంఘటనలో పాల్గొన్నారని వివరించారు. అనంతరం పార్టీ అగ్రనేతల ప్రవర్తన, వేధింపులు నచ్చక జనజీవన స్రవంతిలో కలిశారని ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ ఉన్నారు.