స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 27 : నియోజకవర్గ కేంద్రం లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ వద్ద శనివారం జరిగే ఆత్మీ య సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి ఏర్పాట్లు, హెలిప్యాడ్ను పార్టీ శ్రేణులతో కలిసి కడియం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శనివారం సాయంత్రం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించే ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్రావుతోపాటు జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, చీఫ్ విప్ వినయ్భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి, కుడా చైర్మన్ సుందర్ రాజు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, మేయర్ గుండు సుధారాణి హాజరవుతారని తెలిపారు. మంత్రి హరీశ్రావు హెలికాప్టర్లో వచ్చి, తొలుత ఎమ్మెల్యే రాజయ్య ఇంటికివెళ్లి తేనీటి విందు చేసి, ఆయనతో కలిసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ మండల, గ్రామ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, బూత్ కమిటీ కన్వీనర్లు, బూత్ కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇన్చార్జిలు, ప్రతి బూత్ కమిటీ నుంచి తరలిరావాలని కోరారు. నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేసేందుకు ప్రచారం మరింత ఉధృతం చేయాలన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో అధిక నిధులు కేటాయించి దేవాదుల పనులు చేపట్టి నియోజకవర్గంలోని రిజర్వాయ ర్లను నింపి రెండు పంటలకు సాగునీరు, 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయడం ప్రజలకు తెలుసని, వారు విశ్వాసంతో ఉన్నారని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కావడం లేదని, మరి ఆ పార్టీల నాయకులు తెలంగాణలో చేస్తామని చెప్పడం ప్రజల చెవిలో పూలు పెట్టడమేనని కడియం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంటే దోచుకోవడం, దాచుకోవడమని, కర్ణాటకలో కరెంట్ లేక రైతులు ఎండిన పంటలతో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారని, కేసీఆర్ పాలనలో ఇప్పటివరకు రైతులు ధర్నాలు చేసిన దాఖలాలు లేవన్నారు. ఏసీపీ శ్రీనివాస్రావు, సీఐ సట్ల రాజు, ఎస్సైలు నాగరాజు, హరికృష్ణ, బీఆర్ఎస్ నాయకులతో కలిసి హెలిప్యాడ్ను పరిశీలించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, మండల వైస్ ఎంపీపీ చల్లా సుధీర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు నరేందర్రెడ్డి, బెలిదె వెంకన్న, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గట్టు రమేశ్, బూర్ల శంకర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పోగుల సారంగపాణి, మామిడాల లింగారెడ్డి, మాజీ సర్పంచ్ ఇల్లందుల ప్రతాప్, ఎంపీటీసీలు రజాక్ యాదవ్, గన్ను నర్సింహులు, గుర్రం రాజు, మార్కెట్ వైస్ చైర్మన్ చందర్ రెడ్డి, తోట సత్యం,తెల్లాకుల రామకృష్ణ, ఎల్మకంటి నాగరాజు, జీడి ప్రసాద్, జోగు కుమారస్వామి, కొంతం శ్రీనివాస్, సున్నం యాదగిరి, మంద రమేశ్, వెంకటస్వామి, రమేశ్ పాల్గొన్నారు.
జఫర్గఢ్: బీజేపీ నాయకులు శుక్రవారం హనుమకొండలోని కడియం క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. స్టేషన్ ఘన్పూర్ ఏఎంసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు అన్నం బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్సీ, స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్లో చేరిన తమ్మడపల్లి(జి)కి చెందిన బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు పందిబోయిన యాదగిరి, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ వార్డు సభ్యుడు పాక రాములు, అన్నెపు రామస్వామి, బీజేపీ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు గుండెబోయిన సురేశ్ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరామన్నారు. కడియం గెలుపు కోసం పాటుపడుతామని తెలిపారు.