హసన్పర్తి, జూన్ 7: తెలంగాణ రాష్ర్టాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ వైపు దేశం మొత్తం చూస్తున్నదని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. చింతగట్టు కేఎల్ఎన్ కన్వెన్షన్ హాల్లో నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాగునీటి దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వినోద్కుమార్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వినోద్కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఎక్కడికక్కడ చర్చలు పెట్టాలన్నారు. రానున్న కాలంలో ఇంతకుమించి ప్రగతిని సాధించి చూపిస్తామని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 298 గురుకులాలు ఉండగా, ప్రస్తుతం 1,064 ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏటా రూ 1.25 లక్షలు ఖర్చు చేస్తున్నదని చెప్పారు.
మామమాటలు చెప్పే నాయకులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రజలను కోరారు. సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ అందించిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. విద్యుత్, సాగునీటికి రాష్ట్రంలో లోటులేకుండా చేసి, ఏటా రెండు పంటలకు నీరు అందిస్తున్న అపర భగీరథుడు కేసీఆర్ అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో సాగునీటి రంగంలో ఇప్పటి వరకు రూ. 144.60 కోట్లతో పనులు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, నీటి పారుదల శాఖ ఎస్సీ సుధాకర్రెడ్డి, ఏఈ ఆంజనేయులు, డీఈ బీ రాజు, డీఈ నాసం రాజు, ఏఈఈ ప్రశాంత్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఈ నెల 12న నియోజకవర్గకేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ రన్వాల్ పోస్టర్ను ఎమ్మెల్యే పోలీసులతో కలిసి ఆవిష్కరించారు.