జనగామ, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : రజకుల ముద్దుబిడ్డ చిట్యాల (చాకలి) ఐలమ్మ పేరిట ఆమె స్వస్థలం పాలకుర్తిలో ఎకరం స్థలంలో రూ.కోటితో భవ నం (ఫంక్షన్హాల్) నిర్మిస్తామని, జనగామ జిల్లా కేం ద్రంలో రజక భవనం కోసం ఎకరం ప్రభుత్వ స్థలం కేటాయిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రకటించారు. జనగామలో రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైలా అయిసయ్య అధ్యక్షతన నిర్వహించిన రజక వృత్తిదారుల రాష్ట్ర 3వ మహాసభలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, అలుగుబెల్లి నర్సిరెడ్డి, జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీమాంధ్ర పాలనలో గ్రామాల్లో కనుమరుగయ్యే స్థితికి చేరుకున్న కులవృత్తులకు తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ తీసుకున్న చారిత్రక నిర్ణయాలతో పూర్వవైభవం వచ్చిందన్నారు.
పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను నాటి పాలకులు ఎవరూ గుర్తించలేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశంతో ఐలమ్మ వర్ధంతి, జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. కులానికి గౌరవం, గుర్తింపు తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని, బీసీ కులాలు ప్రధానంగా రజకుల కోసం కాంగ్రెస్, బీజేపీ ఏం చేసిందని అని ప్రశ్నించారు. రజకులు, నాయీ బ్రాహ్మణులకు వృత్తిపరమైన పరికరాలను సబ్సిడీపై అందించడం, ఇస్త్రీ దుకాణాలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న మహానుభావుడు కేసీఆర్ అని అన్నారు. మున్సిపాలిటీలో దాదాపు రూ.300 కోట్లు ఖర్చుచేసి ధోబీఘాట్లు నిర్మిస్తున్నారని తెలిపారు. రూ.వందకోట్ల విలువైన రెండెకరాల స్థలంలో హైదరాబాద్లో రజక ఆత్మగౌరవ భవనం నిర్మిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని, ఇలాంటి కార్యక్రమాలు దేశంలోని ఏ రాష్ర్టాల్లో అమలు కావడం లేదన్నారు. పాలకుర్తిలో భవనంతోపాటు జనగామ జిల్లా కేంద్రంలో ఎకరం ప్రభుత్వ స్థలాన్ని రజక సంఘం కోసం కేటాయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రజకసంఘానికి స్థలం : ముత్తిరెడ్డి
కులాలు, వృత్తులను చిన్నవని భావించవద్దని చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, కంసాలి వంటి వృత్తిదారులు సమాజానికే భూషణాలు.. అలంకారాలు.. కీర్తి కిరీటాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అభివర్ణించారు. జిల్లా కేంద్రంలో రజక సంఘానికి ఎకరం ప్రభుత్వ స్థలం మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ కులవృత్తులను కొత్త జీవం పోసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. సకల కులాలు, సర్వమతాల ఆత్మగౌరవానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. నాగరికత నిర్మాణంలో రజకుల పాత్ర కీలకమని మీకుండే ప్రత్యేకతలే వేరన్నారు.
వైకుంఠధామం, సైన్స్ సెంటర్ను పరిశీలించిన చీఫ్ విప్
నయీంనగర్, ఏప్రిల్ 29 : మంత్రి కేటీఆర్ వచ్చే నెల 5న హనుమకొండలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు గ్రేటర్ 57వ డివిజన్లోని వైకుంఠధామం, సైన్స్ సెంటర్, సైన్స్ పార్కును చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి శనివారం పరిశీలించారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు సిక్తాపట్నాయక్, ప్రావీణ్య, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ పాల్గొన్నారు.