చిన్నగూడూరు, ఆగస్టు (మరిపెడ)18: అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తూ ఇతర రాష్ర్టాలకు తెలంగాణను ఆదర్శంగా నిలిపారని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. గురువారం మరిపెడ మం డల సర్వసభ్య సమావేశం ఎంపీపీ గుగులోత్ అరుణ-రాంబాబు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అభివృద్ధి పనులపై సమీక్షించి మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లోని ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఇంటింటికీ శుద్ధి చేసిన మిషన్ భగీరథ నీరు అందించాలన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. మురుగునీటి గుంతలు, పారిశుధ్యంపై పంచాయతీలు దృష్టిసారించి సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్ర సందర్శనలు చేస్తూ నిత్యం రైతులకు సలహాలు, సూచనలు అందించాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, జడ్పీటీసీ శారద, తహసీల్దార్ రాంప్రసాద్, మిషన్ భగీరథ డీఈఈ అనూష, ఎంపీడీవో ధన్సింగ్, పీహెచ్సీ వైద్యాధికారి రవికుమార్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అదికారులు పాల్గొన్నారు.
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మున్సిపల్ కేంద్రంలో పలువురు మానసిక వికలాంగులు, వృద్ధులకు న్యూట్రిషన్ కిట్లను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. పోషకాహార లోపం ఎందరో చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపుతుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి చిన్నారుల భవిష్యత్కు బం గారు బాటలు వేసేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బా లింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నట్లు చె ప్పారు. అనంతరం పట్టణానికి చెందిన భూక్యా ఠాగూర్ అనారోగ్యంతో మృతి చెందగా, మృతదేహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో సీడీపీవో శిరీషా, శ్రీనివాస్, రఘురామ్,టీ ఆర్ఎస్ నాయకులు మహేందర్రెడ్డి, రాంబాబు, వెంకన్న, వస్రాం ఉన్నారు.