కురవి, నవంబర్ 3 : కురవిలో ‘ఈఎంఆర్ఎస్’ రాష్ట్రస్థాయి పోటీలు మూడో రోజు హోరాహోరీగా కొనసాగాయి. గురువారం అండర్-19, అండర్-14 విభాగాల్లో అథ్లెటిక్స్ పోటీలు పూర్తికాగా ఆర్చరీ పోటీలను జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల గురుకులాల ఆర్సీవో రాజ్యలక్షి, రాష్ట్ర గురుకుల స్పోర్ట్స్ ఆర్గనైజర్ రమేశ్ ప్రారంభించారు. కబడ్డీ ఆటలను ప్రో కబడ్డీని తలపించేలా రెఫరీలు ఆడించారు. తొలిసారి నిర్వహిస్తున్న రాష్ట్ర పోటీల్లో కబడ్డీ, జూడో, రెజ్లింగ్, బాక్సింగ్ కోసం మ్యాట్లు ఏర్పాటుచేయడంతో క్రీడాకారులకు గాయాలు తక్కువగా అయ్యాయి. అండర్-19 గర్ల్స్ ఫైనల్ కబడ్డీ మ్యాచ్లో సీరోలు-ఎల్లారెడ్డిపేట జట్లు పోటీపడగా సీరోలు జట్టు తొలిస్థానం దక్కించుకుంది. అండర్-19 బాలికల ఫుట్బాల్ పోటీల్లో కురవి మొదటి స్థానం దక్కించుకోగా, సీరోలు రెం స్థానం దక్కించుకుంది. బాలుర విభాగంలో అండర్-19 కబడ్డీ ఫైనల్స్లో నార్నూర్-బాలానగర్ జట్లు తలపడనున్నాయి. కబడ్డీ అండర్-17 బాలుర విభాగంలో కల్వకుర్తి మొదటి స్థానం దక్కించుకోగా కొత్తగూడ రెండో స్థానంలో నిలిచింది. అండర్-19 ఫుట్బాల్ బాలుర విభాగంలో కల్వకుర్తి మొదటి స్థానం, బాలానగర్ రెండో స్థానం దక్కించుకుంది. 17 రకాలకు పైగా ఆటలన్నీ ఫైనల్ స్థానానికి చేరుకున్నాయి. జూడో, రెజ్లింగ్, ఆర్చరీ, థైక్వాండో, బాక్సింగ్ పోటీలు సెమీఫైనల్స్ స్థాయిలో నిలిచాయి. నాల్గోరోజు ముగింపు సందర్భంగా ఏర్పాట్లను ఈఎంఆర్ఎస్ అధికారుల బృందం పర్యవేక్షిస్తున్నది.
అండర్-14 బాలురు 100 మీటర్ల రన్నింగ్ :
జిమ్నాస్టిక్స్లో అండర్-14, 19 బాలికల విభాగంలో మూడు రకాల(ఎరోబిక్, ఫ్లోర్, రిథమిక్) ఈవెంట్లు నిర్వహించారు. ఎరోబిక్లో అండర్-14లో రక్షిత-గన్ని(ఎల్లారెడ్డిపేట) మొదటిస్థానం దక్కించుకోగా, ఉట్నూరు గురుకులానికి చెందిన సులోచన-శిరీష రెండో స్థానం, ఎల్లారెడ్డిపేటకు చెందిన అమూల్య, బులాబాయి మూడో స్థానంలో నిలిచారు. ఫ్లోర్ విభాగంలో ఎల్లారెడ్డిపేటకు చెందిన గన్ని, బాలుబాయి, రక్షితలు వరుసగా గెలుచుకున్నారు. రిథమిక్(గూపు)లో ఎల్లారెడ్డిపేట(మొదటి), దుమ్ముగూడెం(రెండో), బయ్యారం(మూడో) విద్యార్థులు గెలుచుకున్నారు.
ఎరోబిక్ అండర్-19 బాలికల విభాగంలో ఎల్లారెడ్డిపేటకు చెందిన వైష్ణవి-హరిత మొదటి స్థానం, అనితశ్రీ-సురక్షిత(పాల్వంచ) రెండో స్థానం, వినీల-కల్యాణి(సీరోలు) మూడో స్థానంలో నిలిచారు. ఫ్లోర్ విభాగంలో ఎల్లారెడ్డిపేటకు చెందిన హరిత నవ్య, నందిని గెలుచుకున్నారు. రిథమిక్(గ్రూపు)లో ఎల్లారెడ్డిపేట(మొదటి), సీరోలు(రెండో), బయ్యారం(మూడో) స్థానాలను దక్కించుకున్నారు. యోగా విభాగంలో యోగాసన్, అర్టిస్టిక్ సోలో, ఆర్టిస్టిక్ పేర్, రిథమిక్ నాలుగు ఈవెంట్లు నిర్వహించారు. అండర్-14 బాలికల యోగాసన్లో గన్నీ-రక్షిత-బాలాబాయి(ఎల్లారెడ్డిపేట) గెలుపొందారు. అర్టిస్టిక్ సోలో రక్షిత(ఎల్లారెడ్డిపేట), సాత్విక(ఎల్లారెడ్డిపేట), నవ్యశ్రీ(బయ్యారం) గెలుపొందారు. ఆర్టిస్టిక్ పేర్లో గన్నీ- బాలాబాయి(ఎల్లారెడ్డిపేట) మొదటి రెండు స్థానాలు గెలుచుకోగా, శ్రీవల్లి(దుమ్ముగూడెం) మూడో స్థానం దక్కించుకున్నారు.
రిథమిక్(గ్రూపు)లో బాలాబాయి-సాత్వికలు(ఎల్లారెడ్డిపేట) మొదటి స్థానం, తేజస్విని-రేవతి ప్రసన్న(పాల్వంచ) రెండవ స్థానం, గన్నీ-రక్షిత(ఎల్లారెడ్డిపేట) మూడో స్థానంలో నిలిచారు. అండర్-19 యోగాసన్లో ఎల్లారెడ్డిపేటకు చెందిన బాలికలు మొదటిస్థానం దక్కించుకున్నారు. ఆర్టిస్టిక్ సోలోలో ఎల్లారెడ్డిపేట మొదటి స్థానం దక్కించుకోగా, సీరోలు బాలికలు రెండో స్థానంలో నిలిచారు. ఆర్టిస్టిక్ పేర్లో ఎల్లారెడ్డిపేట క్రీడాకారిణులు మొదటి రెండు స్థానాలు దక్కించుకోగా పాల్వంచ విద్యార్థినులు మూడో స్థానానికి పరిమితమయ్యారు. రిథమిక్లో ఎల్లారెడ్డిపేట మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకుంది. అండర్-14 బాలుర విభాగంలో ఎరోబిక్లో బాలానగర్, గూడూరు, చర్ల గెలుపొందాయి. ఫ్లోర్ విభాగంలో బాలానగర్ మొదటి రెండు స్థానాలు గెలుచుకోగా, పాల్వంచ విద్యార్థి మూడవస్థానం దక్కించుకున్నాడు. అండర్-19 బాలుర విభాగంలో ఎరోబిక్లో బాలానగర్ మొదటి, దుమ్మగూడెం రెండో, ముల్కలపల్లి మూడో స్థానాలు దక్కించుకున్నాయి. ఫ్లోర్ విభాగంలో బాలానగర్ మొదటి రెండుస్థానాలు దక్కించుకోగా, ముల్కలపల్లి మూడో స్థానంలో నిలిచింది.