ఆత్మీయ సమ్మేళనాలు బీఆర్ఎస్కు సత్ఫలితాలను ఇస్తున్నాయి. స్వయంగా భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి సారయ్య సమ్మేళనాల్లో నేతలు, కార్యకర్తలకు మేమున్నామంటూ ఒకేతాటిపై నడిపిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో పత్రాలతో గడపగడపకూ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటికి చేరుతున్నారు. యూత్ నాయకులు, అనుబంధ సంఘ యూత్ నాయకులను రాష్ట్ర యూత్ నాయకుడు గౌతమ్రెడ్డి కలుపుకొనిపోతూ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే ఎన్నికల ప్రచారానికి వస్తానని ఎమ్మెల్సీ మధుసూదనాచారి చెప్పడంతో బీఆర్ఎస్లో జోష్ కనిపిస్తున్నది.
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. నాయకులు, కార్యకర్తల్లో సమన్వయానికి దోహదపడుతున్నాయి. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బస్వరాజు సారయ్య సమ్మేళనాల్లో పాల్గొని నాయకులు, కార్యకర్తలకు మేమున్నాం అం టూ భరోసానిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలను సరిచేస్తూ సమన్వయంతో ముందుకు నడిపిస్తున్నారు. దీంతో ప్రతి కార్యకర్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాడు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకా లు, కేసీఆర్ మ్యానిఫెస్టో హామీ పత్రాలతో గడపగడప కూ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమం లో కాంగ్రెస్, బీజేపీల నుంచి నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటికి చేరుతున్నారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్యేనని, భూపాలపల్లిలో గెలిచేది గండ్ర వెంకటరమణారెడ్డేనని, బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వసిస్తూ హస్తం, కమలం శ్రేణులు ఆ పార్టీలకు గుడ్బై చెప్తున్నారు. గ్యారెంటీలు ఒక డ్రామా అంటూ ప్రజలకు వివరిస్తున్నారు.
భూపాలపల్లి నియోజకవర్గంలోని గోరికొత్తపల్లి, చిట్యాల, భూపాలపల్లి మండలాల నుంచి ఒకే రోజు సోమవారం 500 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు. వారికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బస్వరాజు సారయ్య, పార్టీ రాష్ట్ర యూత్ నాయకులు గండ్ర గౌతమ్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేశాలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సుమారు 200 మంది, వార్డు కౌన్సిలర్ రజితాజుమ్ములాల్, పార్టీ సీనియర్ నాయకులు మోతె రాజు, వార్డు అధ్యక్షుడు దుండ్ర కుమార్యాదవ్, పార్టీ నేతలు కొడారి రాజేందర్, జాగరి అజయ్, ముస్కె పద్మ, తాత సంపత్, పోలవేన ప్రసాద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు కొడారి రాజేందర్ ఆధ్వర్యంలో వివేకానంద యూత్ కమిటీ సభ్యులు మేకల లక్ష్మీపతి, మునిగంటి శశి, గంట స్వామి, తాత రాజ్కుమార్, గజ్జె ప్రశాంత్, పాలిక విజేందర్తో పాటు మరో 20 మంది కారెక్కారు. గోరికొత్తపల్లి మండలం నుంచి సుమారు 150 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే గండ్ర వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిట్యాల మండ లం గోపాల్పూర్కు చెందిన 50మంది బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఇదిలా ఉండగా ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వేశాలపల్లి, పెద్దకుంటపల్లి, జంగేడు గ్రామాల నుంచి 250 మంది బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులతో పాటు మరికొంత మంది యువకులు చేరిన విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ నుంచి చేరికల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.
నియోజకవర్గంలోని యువకులతో బీఆర్ఎస్ రాష్ట్ర యూత్ నాయకులు గండ్ర గౌతమ్రెడ్డి టచ్లో ఉంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని మండలాలకు చెందిన యూత్ నాయకులు, అనుబంధ సంఘం యూత్ నాయకులతో గౌతమ్రెడ్డి కలుపుకుపోతూ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తున్నారు.
భూపాలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డిని అదిష్టానం ప్రకటించడంతో కొంత మేరకు అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి వర్గం ఇప్పుడిప్పుడే కలిసి వస్తుంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సిరికొండతో చర్చలు జరిపి గండ్రకు సహకరించాలని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ విషయమై మధుసూదనాచారి తనయుడు సిరికొండ ప్రశాంత్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అదిష్టానం ఆదేశాలను పాటిస్తామని, వారు ఆదేశిస్తే గండ్ర గెలుపు కోసం ప్రచారంలో పాల్గొంటామని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయమై పలుమార్లు గండ్ర వెంకటరమణారెడ్డి మధుసూదనాచారి ఇంటికి వెళ్లి తన గెలుపుకు సహకరించాలని అభ్యర్థించారు. త్వరలోనే ఎన్నికల ప్రచారానికి వస్తానని హామీ ఇచ్చారని రమణారెడ్డి వెల్లడించారు. దీంతో చారి వర్గం నాయకులు, కార్యకర్తలు క్రమక్రమంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ జోష్ కనిపిస్తున్నది.