వెంకటాపూర్, మార్చి 23 : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయంలో సోమసూత్ర పునరుద్ధరణ పనులను శనివారం పురావస్తు శాఖ అధికారులు పూర్తిచేశారు. గర్భాలయంలో అభిషేకం చేసిన నీళ్లు బయటికి వెళ్లేందుకు ఐదు రోజుల క్రితం పనులు మొదలుపెట్టగా శనివారం ముగిశాయి. ఆలయ గర్భగుడి నుంచి సోమసూత్రం గుండా నీరు వెళ్లేలా డ్రిల్లింగ్ వేసి, సుమారు 15 మీటర్ల మేర కందకం తవ్వి పైపులు వేసి నీరు ఆలయం వెలుపలికి వెళ్లేలా చేశారు.
దీంతో పాటు గతంలో అభిషేకానికి నీళ్లను అర్చకులు, సిబ్బంది బిందెల ద్వారా మోసుకోగా ఇప్పుడు గార్డెన్లోని బోరు నీళ్లు గర్భగుడిలోకి వెళ్లేలా పైపులు అమర్చారు. దీని వల్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో కామేశ్వరాలయ పనులు ప్రారంభం కామేశ్వరాలయంతో పాటు, ఆగ్నేయ దిశలో సగం వరకు కూలిన ప్రహరీ నిర్మాణానికి పురావస్తు శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలోనే కామేశ్వరాలయ పునరుద్ధరణకు కేంద్ర పురావస్తు శాఖ రూ.11కోట్లు మంజూరు చేయగా త్వరలోనే పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.