నెక్కొండ, ఫిబ్రవరి 1: వైస్ షర్మిల తన పాపదయాత్రలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిపై రెచ్చగొట్టే ప్రసంగాలు, వ్యాఖ్యలు చేయొద్దని, ప్రజా సమస్యలపై మాట్లాడితే ఎలాంటి అభ్యంతరాలు ఉండవని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. మండలకేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, సొసైటీ చైర్మన్ మారం రాము, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్యాదవ్, సీనియర్ నాయకుడు చల్లా చెన్నకేశవరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షర్మిల బీఆర్ఎస్ నేతలపై నిరాధారమైన, అసత్య, వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయ దురుద్దేశంతో తెలంగాణ అస్థిత్వాన్ని, ఉద్యమ నేపద్యాన్ని, ఉద్యమకారులను అవమానించేలా మాట్లాడితే ప్రజాక్షేత్రంలో నిరసన తప్పదని స్పష్టం చేశారు. సమావేశంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ కే రవీందర్రెడ్డి, మండల నాయకులు తాటిపెల్లి శివకుమార్, పట్టణ అధ్యక్షుడు కే భిక్షపతి, ఈ రమేశ్, వీరస్వామి, అశోక్, నరేందర్, వెంకటేశ్ పాల్గొన్నారు.
ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు
చెన్నారావుపేట: అసత్య, వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ మండల నాయకులు షర్మిలను హెచ్చరించారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ షర్మిల పాదయాత్రపై బీఆర్ఎస్కు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిపై రెచ్చగొట్టే ప్రసంగాలు, వ్యాఖ్యలు చేస్తే నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 14 ఏళ్లు సుదీర్ఘంగా పాల్గొన్న పెద్ది.. ఎమెల్యేగా నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. సమావేశంలో ఆర్బీఎస్ మండల అధ్యక్షుడు బుర్రి తిరుపతి, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు నరేందర్, గ్రామ అధ్యక్షుడు సాంబయ్య, నాయకులు మహేందర్రెడ్డి, లింగంనాయక్, వీరాసింగ్, కడారి సాయిలు, యాదగిరి పాల్గొన్నారు.