సురక్షా దినోత్సవాన్ని అంతటా ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం పోలీసు శాఖ సమర్థవంతమైన సేవల గురించి ప్రజలకు తెలిసేలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా అవగాహన ర్యాలీలు, శకటాల ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ కమిషనరేట్ సహా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోని జంక్షన్లు, ప్రధాన రహదారులపై కనుచూపుమేర పెట్రోకార్స్, బ్లూకోల్ట్స్, ఇంటర్సెప్టర్, ఫైరింజన్ వాహనాల బారులు, మరోవైపు షీ టీమ్స్, భరోసా, ఫ్రెండ్లీ పోలీసింగ్పై సిబ్బంది, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జనగామలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్లో మంత్రి సత్యవతిరాథోడ్, కమిషనరేట్ వద్ద సీపీ రంగనాథ్తో కలిసి చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ప్రారంభించగా ఎక్కడికక్కడ కలెక్టర్లు, ఎస్పీలు, డీసీపీలు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలు, ప్లకార్డులు చేతబూని ఉత్సాహంగా పాల్గొన్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 4
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సురక్షా దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా అంతటా ఘనంగా జరుపుకొన్నారు. జనగామ జిల్లాకేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ శివలింగయ్య, డీసీపీ సీతారాం పాల్గొన్నారు. దేశంలో తెలంగాణ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. అలాగే మహబూబాబాద్లో ఉత్సవాలను గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించగా కలెక్టర్ శశాంక, ఎంపీ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే శంకర్నాయక్ పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు.
హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వద్ద సీపీ రంగనాథ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సురక్షా దినోత్సవ ముగింపు కార్యక్రమానికి ఎర్రబెల్లి హాజరయ్యారు. వరంగల్లో ఐడీవోసీ గ్రౌండ్(అజాంజాహి మిల్స్ స్థలం)లో నిర్వహించిన ఉత్సవాల్లో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కలెక్టర్ ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ ఏ.వీ.రంగనాథ్ పాల్గొన్నారు. ఐనవోలులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్, సీపీ రంగనాథ్ పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎస్పీ సురేందర్రెడ్డి, అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, ములుగులో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ గౌస్ ఆలం, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, నర్సంపేట మండలం రాజపల్లిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 4